
యోగా డేకు భారీ ఏర్పాట్లు
భర్తకు దేహశుద్ధి
కొయ్యలగూడెంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తికి ఆయన భార్య దేహశుద్ధి చేసింది. తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. IIలో u
ఏలూరు(మెట్రో): జిల్లావ్యాప్తంగా ఈనెల 21న యోగా దినోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి యోగా దినోత్సవం, తల్లికి వందనం పథకంపై అధికారుతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 9 లక్షల మంది యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో ఏలూరులో మూడు ప్రదేశాల్లో 5 వేల మంది చొప్పున యోగాభ్యాసన చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే కార్యక్రమాల వివరాలను యోగాంధ్ర యాప్లో వెంటనే నమోదు చేయాలన్నారు. తల్లికి వందనం పథకాన్ని అర్హులైన తల్లులందరికీ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న తల్లుల ఈ–కేవైసీ వెంటనే పూర్తి చేయాలనీ, అభ్యంతరాలపై అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.
ముఖ్యమంత్రి సమీక్ష
సీఎం చంద్రబాబు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి యోగాంధ్ర కార్యక్రమం, తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, అధికారులు హాజరయ్యారు.
నేడు రెవెన్యూ దినోత్సవం
ఏలూరు(మెట్రో): రెవెన్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం వేడుకలు నిర్వహించనున్నట్టు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రమేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సభా ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ రెండు శతాబ్దాలకు పైగా ప్రజలకు సేవలందిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.