
కోకో గింజల దొంగలు దొరికారు
ఏలూరు టౌన్ : కోకో గింజల చోరీ కేసులో నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 430 కిలోల కోకో గింజలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామంలో ఆలపాటి జగదీష్కుమార్ పొలంలో ఉన్న షెడ్డులోని 160 కిలోల కోకో గింజలను ఈనెల 15వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి భీమడోలు సీఐ విల్సన్ ఆధ్వర్యంలో ఎస్సై సుఽధీర్ దర్యాప్తు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈనెల 17న సాయంత్రం అంగిడిగూడెం సంతమార్కెట్ సమీపంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామానికి చెందిన కొత్లపల్లి హర్ష, ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామానికి చెందిన గెద్దల నాగరాజు, ముదునూరి శివశంకర్, తడికలపూడి గ్రామానికి చెందిన జొన్నకూటి రాజేష్గా గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు జల్సాలు, వ్యసనాలకు బానిసలై డబ్బు సంపాదించేందుకు రాత్రివేళల్లో పొలాల్లోకి వెళ్లి కోకో గింజలను చోరీ చేస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. వీరిపై దెందులూరు, తడికలపూడి, ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి 430 కోకో గింజలను స్వాధీనం చేసుకోగా వాటి విలువ సుమారు రూ.2.15 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. నేరానికి వినియోగించిన రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన కోకో గింజలను పెదవేగి మండలం చక్రాయగూడెం గ్రామానికి చెందిన సిరిబత్తుల ఉదయ్కుమార్ కొనుగోలు చేయడంతో అతడ్ని కూడా నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ విల్సన్, ఎస్సై సుధీర్, హెచ్సీ ఎస్.శ్రీనివాస్, పీసీ ఎం.వెంకటేశ్వరరావు, సీహెచ్ లక్ష్మీనారాయణ, హెచ్జీ వీజే ప్రకాష్బాబును ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అభినందించారు.
చోరీ సొత్తు 430 కిలోల కోకో గింజల స్వాధీనం