విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద పడిగాపులు

Jun 18 2025 3:19 AM | Updated on Jun 18 2025 3:19 AM

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద పడిగాపులు

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద పడిగాపులు

యలమంచిలి: అధిక విద్యుత్‌ వినియోగం సాకుతో ప్రభుత్వం చాలామందికి శ్రీతల్లికి వందనంశ్రీ సొమ్ములు జమ చేయలేదు. దీంతో తల్లులు లబోదిబోమంటున్నారు. సోమవారం లబ్ధిదారులంతా సచివాలయానికి వెళ్లి అడిగితే రూ.300 యూనిట్ల లోపే విద్యుత్‌ వినియోగం ఉంటే కరెంట్‌ ఆఫీస్‌ నుంచి సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే గ్రీవెన్స్‌లో పెడతామని చెప్పారు. దీంతో మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లబ్థిదారులు మంగళవారం ఉదయం నుంచి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద పడిగాపులు పడ్డారు. విద్యుత్‌ శాఖ సిబ్బంది ప్రతి ఒక్కరీ విద్యుత్‌ బిల్లు, సెల్‌, ఆధార్‌ నెంబర్లతో ఆన్‌లైన్‌లో తనిఖీ చేసి అంత వాడకం లేని వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. అయితే ఒక్కసారిగా వందల సంఖ్యలో లబ్థిదారులు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు తరలిరావడంతో బిల్లులు తనిఖీ చేయడానికి సిబ్బంది నానాయాతన పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement