కొల్లేరులో జిరాయితీ పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో జిరాయితీ పంచాయితీ

Jun 18 2025 3:39 AM | Updated on Jun 18 2025 3:47 AM

కీలకమైన సిఫార్సులు

బుధవారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు ప్రాంతంలో కేంద్ర సాధికారత కమిటీ పర్యటన నేపథ్యంలో జిరాయితీ భూముల వ్యవహారం ప్రధానాంశంగా మారింది. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు స్థానికులకు జీవనోపాధితో పాటు భూములపై హక్కులు ఉండేలా చూడాలని వందలాది వినతులు వెల్లువెత్తాయి. ప్రధానంగా అభయారణ్యంలోని జిరాయితీ డీ–ఫామ్‌ భూములు మినహాయించాలని డిమాండ్‌ స్థానికుల నుంచి బలంగా వినిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం నియమించిన కేంద్ర సాధికారత కమిటీ మంగళవారం కొల్లేరు ప్రాంతంలో పర్యటించింది. కై కలూరు, ఉండి నియోజకవర్గాల్లోని కొల్లేరు ప్రాంతంలో పర్యటించి అభయారణ్యాన్ని, కొల్లేరు స్థితిగతులను పరిశీలించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొల్లేరును కాపాడండి– మమ్మల్ని కాపాడండి అంటూ పెద్ద ఎత్తున కొల్లేరువాసులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 10వ కాంటూరు వరకు 2.25 లక్షల ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. 2004లో కొల్లేరు ఆపరేషన్‌ నిర్వహించి అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేశారు. పేదల ముసుగులో బడా వ్యక్తులు, రాజకీయ నాయకులు అడ్డగోలుగా వేలాది ఎకరాల చేపల చెరువులు ఏళ్ల తరబడి సాగు చేసి వందల కోట్లు ఆర్జించారు. ఈ క్రమంలో ఆపరేషన్‌ కొల్లేరులో 31,120 ఎకరాల చెరువులను ధ్వంసం చేశారు. దీనిలో 14,932 ఎకరాల్లో జిరాయితీ భూములు, 5,510 ఎకరాల డీ–ఫాం భూములు, ఇతర కొల్లేరు అభయారణ్యం ఉంది. తదనంతరం కొల్లేరు అభయారణ్యంలో మొత్తంగా 77,138 ఎకరాల్లో జిరాయితీ, డీఫాం భూములు ఉన్నట్లు నిర్ధారించారు. 3 లక్షల జనాభా ఉన్న కొల్లేరు ప్రాంతంలో చేపల వేట ప్రధాన వృత్తిగా వేలాది కుటుంబాలున్నాయి. 122 గ్రామాల్లో కొల్లేరు వాసులు నివసిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సరస్సులో నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి గతంలో అనేక కమిటీలు ఏర్పాటు చేసినా ఆశించిన ప్రయోజనం చేకూరలేదు.

అనేక కమిటీలు.. సిఫార్సులు

కొల్లేరు పరిరక్షణకు అక్రమ చెరువుల కట్టడికి దాదాపుగా 4 దశాబ్దాల నుంచే కమిటీలు ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు, హైకోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకు అనేక న్యాయపోరాటాలు కొనసాగినా శాశ్వత పరిష్కారం నేటికీ దక్కలేదు. సరస్సును పరిరక్షిస్తూ స్థానికుల జీవనప్రమాణాలు పెంచి పూర్తి ఉపాధి అవకాశాలుండేలా చూడాలనేదే ఏళ్ళ నుంచి ఉన్న డిమాండ్‌. ఈ క్రమంలో 1983లో కేఎల్‌డీసీ సబ్‌ కమిటీ, 1987 శ్రీ రామకృష్ణయ్య కమిటీ, 1996లో శాసనసభ కమిటీ, 2006లో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారత కమిటీ, 2010లో అజీజ్‌ కమిటీ, 2015లో సుకుమార్‌ కమిటీ ఇలా అనేక కమిటీలు రకరకాల నివేదికలు సమర్పించాయి.

● సముద్రానికి నీరు పోయే కీలక మార్గమైన ఉప్పుటేరులో ఆక్రమణలు తొలగించి సామర్ధ్యం పెంచాలి.

● బుడమేరు, తమ్మిలేరుపై వరద కట్టలు, జలాశయాల నిర్మాణం, చిన్న, పెద్ద కాలువలు మళ్లింపు జరగాలి.

● కొల్లేరు అవుట్‌ఫాల్‌ ఉన్న ఉప్పటేరు వద్ద రెగ్యులేటరీ ఏర్పాటు చేయడంతో పాటు వెడల్పు, లోతును సరిచేయాలి.

● సరస్సు పరిరక్షణ కోసం సిల్ట్‌ తొలగించి 4వ కాంటూరులో వెదురు చెట్లు ఏర్పాట్లు చేయాలి. అక్రమ రొయ్యలు, చేపల చెరువులను నియంత్రించి సరస్సును పరిరక్షించడంతో పాటు నీటి కాలుష్యాన్ని తగ్గించాలి.

● రెగ్యులేటర్‌ నిర్మాణం తర్వాత చానలైజేషన్‌్‌ పథకాన్ని తిరిగి ప్రారంభించి ప్రవాహ మార్గాల్లో అవసరమైన చోట్ల కాల్వ మళ్ళింపు జరగాలి.

● 7500 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదికి మళ్లించడానికి బుడమేరులో ఉన్న మళ్లింపు చానెల్‌ను సాధ్యమైనంత వరకు మెరుగుపరచాలి

● కొల్లేరు సరస్సు ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి క్షేత్ర, ఉపగ్రహ సర్వే నిర్వహించాలి, పాత రికార్డులు 1900 ఏడీ గెజిట్‌ ప్రకారం సర్వే చేయాలి. వాస్తవ కాంటూరు పరిధులను గుర్తించి సరస్సులో అక్రమ అనధికార చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేయాలి.

న్యూస్‌రీల్‌

అభయారణ్యంలో 77 వేల ఎకరాల భూములు

కొల్లేరు ఆపరేషన్‌లో 31 వేల ఎకరాల్లో చెరువులు ధ్వంసం

కాంటూరు పరిధిని గుర్తిస్తేనే సమస్యకు పరిష్కారం

జిరాయితీ భూములపై హక్కు కల్పించాలని కొల్లేరు ప్రజల డిమాండ్‌

కేంద్ర సాధికారత కమిటీకివినతుల వెల్లువ

నేడు కూడా జిల్లాలో కమిటీ పర్యటన

కొల్లేరులో జిరాయితీ పంచాయితీ1
1/2

కొల్లేరులో జిరాయితీ పంచాయితీ

కొల్లేరులో జిరాయితీ పంచాయితీ2
2/2

కొల్లేరులో జిరాయితీ పంచాయితీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement