కొందరికే తల్లికి వందనం | - | Sakshi
Sakshi News home page

కొందరికే తల్లికి వందనం

Jun 18 2025 3:19 AM | Updated on Jun 18 2025 3:19 AM

కొందర

కొందరికే తల్లికి వందనం

నరసాపురం రూరల్‌: కూటమి సర్కార్‌ అట్టహాసంగా అమలు చేసిన శ్రీతల్లికి వందనంశ్రీ నిరుపేద తల్లులకు అందకుండా పోయింది. పథకం అమలుకు సవాలక్ష నిబంధనలు విధించిన కూటమి సర్కార్‌ అంతిమంగా అర్హులకు మొండిచేయి చూపింది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ ఏటా రూ.15 వేల చొప్పున క్రమం తప్పకుండా ఇస్తామని ఎన్నిక వేళ హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచాక రూ.13 వేలే అంటూ మాటమార్చారు. అది కూడా అందరికీ ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో చంద్రబాబు మాటలు నమ్మి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న నిరుపేద కుటుంబాల వారు శాపనార్థాలు పెడుతున్నారు.

నిబంధనలతో కొర్రీలు

తల్లికి వందనం కింద ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్న చంద్రబాబు.. పథకం అమల్లోకి వచ్చేసరికి సవాలక్ష నిబంధనలు విధించారు. యూడైస్‌ ప్రకారం జాబితాలు సేకరించామని చెబుతున్నప్పటికీ చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు ప్రభుత్వం సేకరించిన గణాంకాలకు తేడా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి సర్కార్‌ (2024–25 విద్యా సంవత్సరం) లో తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తం ఎగవేసి ఈ సంవత్సరం ఇస్తామన్న మొత్తంలో కూడా భారీగా కోతలు విధించి అర్హత ఉన్నప్పటికీ చాలా మందికి శ్రీతల్లికి వందనంశ్రీ ఆర్థిక సాయం మొత్తం ఖాతాల్లో జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలు, బ్యాంకులు, కరెంటు ఆఫీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమకానట్లు తెలియడంతో చాలామంది ఉసూరు మంటూ వెనుదిరిగి వెళుతున్నారు. నరసాపురం మండలం, పట్టణంలలో ఎక్కువమందికి విద్యుత్‌ వినియోగం ఎక్కువ అనే కారణంతో పథకం సొమ్ములు జమకాలేదని తెలియడంతో నరసాపురం పట్టణంలోని విద్యుత్‌సబ్‌ స్టేషన్‌ వద్ద గత రెండు రోజులుగా పథకం లబ్ధిదారులు క్యూకడుతున్నారు.

జగన్‌ హయాంలో విప్లవాత్మక మార్పులు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో విద్యార్థుల భవితకు బాటలు వేశారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు. అంతేకాకుండా శ్రీనాడు– నేడుశ్రీ పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. విదేశీ విద్యా దీవెన, గోరుముద్ద తదితర పథకాలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు.

నిబంధనల పేరుతో చాలామందికి ఎగనామం

మండలానికి వెయ్యి మందికి పైగా కోత

కరెంట్‌ బిల్లులను సాకుగా చూపి అర్హులకూ మొండిచేయి

మాట తప్పిన చంద్రబాబుపై మండిపడుతున్న జనం

కొందరికే తల్లికి వందనం 1
1/1

కొందరికే తల్లికి వందనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement