బీటెక్‌ బేరాలు షురూ! | - | Sakshi
Sakshi News home page

బీటెక్‌ బేరాలు షురూ!

Jun 17 2025 5:40 AM | Updated on Jun 17 2025 5:40 AM

బీటెక్‌ బేరాలు షురూ!

బీటెక్‌ బేరాలు షురూ!

సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించలేదు. కనీసం ప్రభుత్వం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కూడా ప్రకటించలేదు. గత నెలలో పరీక్షలు నిర్వహించగా ఈనెలలో ఫలితాలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్ల ముందస్తు విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. మేనేజ్‌మెంట్‌ సీట్ల రిజర్వేషన్‌ పేరిట పెద్ద ఎత్తున సీట్లను కళాశాలల్లో విక్రయిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 14 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 13,330 సాధారణ సీట్లు, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 1,333 సీట్లు మొత్తంగా 14,663 సీట్లు ఉన్నాయి.

కంప్యూటర్‌ సైన్స్‌కు యమ డిమాండ్‌

సాఫ్ట్‌వేర్‌కు బూమ్‌ రావడంతో దాదాపుగా రెండు ద శాబ్దాలుగా ఇంజనీరింగ్‌ కోర్సులకు డిమాండ్‌ కొ నసాగుతోంది. ప్రధానంగా కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు నూరు శాతం డిమాండ్‌తో భర్తీ అవుతున్న పరిస్థితి. 15 ఏళ్ల క్రితం వరకు ఏలూరు, భీమవరం కేంద్రా లకే పరిమితమైన ఇంజనీరింగ్‌ కళాశాలలు తర్వాత కాలంలో జిల్లావ్యాప్తంగా ఏర్పాటయ్యాయి. ప్రస్తు తం 14 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఠంచనుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో పడటంతో ఆర్థిక భారం లేకుండా నాలుగేళ్లపాటు చదువు సజావుగా సాగింది. కూ టమి పాలనలో గత విద్యా సంవత్సరం ఫీజు రీయి ంబర్స్‌మెంట్‌ బకాయిలు నిలిచిపోవడం, ఈ విద్యా సంవత్సరం అసలు అమలు చేస్తారో లేదో ప్రకటించకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ రాకముందే ఇంటర్మీడియెట్‌ మార్కులు, ఏపీ ఈఏపీసెట్‌ ర్యాంకు ఆధారంగా వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు మేనేజ్‌ మెంట్‌ సీట్ల పేరుతో ముందస్తుగా నగదు చెల్లించి సీట్లు లాక్‌ చేస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో సీట్ల బేరసారాల హడావుడి కొనసాగుతోంది.

అడ్వాన్స్‌ పేమెంట్లతో..

ప్రతి కళాశాలలో ఒక్కో బ్రాంచీలో 30 శాతం మే నేజ్‌మెంట్‌ సీట్లు, మిగిలినవి కన్వీనర్‌ కోటాలో ఉంటాయి. ఉదాహరణకు ఒక బ్రాంచిలో 60 సీట్లు ఉంటే వాటిలో 42 సీట్లు ఈఏపీసెట్‌ ర్యాంకు ఆధారంగా కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన 18 సీట్లు ఆయా కళాశాలల మేనేజ్‌మెంట్‌ భర్తీ చేసుకుంటుంది. ఈ క్రమంలో అన్ని కళాశాలల్లో మేనేజ్‌మెంట్ల సీట్ల భర్తీకి ప్రత్యేక డ్రైవ్‌ల హడావుడి కొనసాగుతోంది. సగటున కళాశాల స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అడ్వాన్స్‌ పేమెంట్స్‌ కట్టించుకుంటున్నారు. కన్వీనర్‌ కోటా సీటు రూ.60 వేలు కాగా మేనేజ్‌మెంట్‌ సీటు రూ.1.80 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తున్నారు. ప్రధానంగా కంప్యూటర్‌ సైన్స్‌కు విపరీతంగా డిమాండ్‌ కొనసాగుతుండగా తరువాత స్థానంలో ఈసీఈ ఉంది. నెలాఖరుకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ సీట్లు భర్తీ కానున్నాయి. జిల్లాలో మేనేజ్‌మెంట్‌ సీట్లు 6 ప్రధాన కళాశాలల్లో నూరు శాతం పూర్తికాగా మరికొన్ని కళాశాలల్లో 50 శాతానికిపైగా పూర్తయ్యాయి.

బీటెక్‌ బేరాలు షురూ!

బీటెక్‌ బేరాలు షురూ!

ఇంజనీరింగ్‌ ఆన్‌ డిమాండ్‌

కౌన్సెలింగ్‌కు ముందే బేరసారాలు

కంప్యూటర్‌ సైన్స్‌కు గిరాకీ

ఉమ్మడి జిల్లాలో 14,663 సీట్లు

భారీగా మేనేజ్‌మెంట్‌ సీట్ల అమ్మకాలు

కాలేజీల వారీగా సీట్లు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 14 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 13,330 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు జిల్లాలో సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 1,200 సీట్లు, రామచంద్ర కళాశాలలో 900 సీట్లు, ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో 600 సీట్లు, హేలాపురి కళాశాలలో 360 సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో 1,360 సీట్లు, సారథి ఇంజనీరింగ్‌ కళాశాలలో 420 సీట్లు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాలలో 1,860, శ్రీ విష్ణు మహిళా కళాశాలలో 960, శ్రీ విష్ణు ఇంజనీరింగ్‌ కళాశాలలో 1,140, భీమవరం ఇంజనీరింగ్‌ కళాశాలలో 300, స్వర్ణాంధ్ర కళాశాలలో 1,620, శ్రీవాసవి కళాశాలలో 1,200, శశి ఇంజనీరింగ్‌లో 1,140, వైజ్‌ ఇంజనీరింగ్‌లో 270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక మరో 10 శాతం సీట్లు అంటే 1,333 సీట్లు ఈడబ్ల్యూస్‌ కోటాలో కేటాయిస్తారు మొత్తంగా 14,663 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement