ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Jun 17 2025 5:07 AM | Updated on Jun 17 2025 5:07 AM

ప్రత్

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సోమవారం ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కొరకు ఆర్జీయూకేటీ దరఖాస్తులను స్వీకరించింది. దీంతో 1340 దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్‌సీసీ, సైనికోద్యోగుల పిల్లలు, క్రీడా, దివ్యాంగులు, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. క్రీడా విభాగంలో 62 మంది, ఎన్‌సీసీ విభాగంలో 85 మంది, సైనికోద్యోగుల పిల్లల విభాగంలో 12 మంది, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగానికి సంబంధించి 15 మంది కలిపి మొత్తం 174 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వచ్చినట్టు అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌ తెలిపారు.

స్కీముల పేరిట మోసగిస్తున్న ముఠా అరెస్ట్‌

తాడేపల్లిగూడెం అర్బన్‌ : ఇచ్చిన సొమ్ముకు రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ స్కీముల పేరిట అమాయక ప్రజలను మోసగిస్తున్న ముఠాను అరెస్ట్‌ చేసినట్టు తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్‌ తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా టేకుల నాయక తండాకు చెందిన సదాసూత సాయికిరణ్‌, మోహనరావు స్నేహితులు. భీమడోలుకు చెందిన ఆర్‌కే రెడ్డి అనే ఆనంద్‌కు సింహాద్రి మోహనరావు స్నేహితుడు. వీరిద్దరికీ సన్నిహితం ఉండటం కారణంగా కోడూరు మండలం చిన్నూరుకు చెందిన నక్క సత్తిబాబు పరిచయమయ్యాడు. ఈ పరిచయంలో భాగంగా సత్తిబాబు తమ వద్ద ఒక స్కీమ్‌ ఉందని, సొమ్ములు ఇచ్చిన వారికి రెట్టింపు సొమ్ములు ఇస్తామని మోహనరావుతో చెప్పాడు. దీంతో ఆశపడిన సాయికిరణ్‌, మోహనరావు కొంత సొమ్మును ఈ నెల 13న తాడేపల్లిగూడెం బస్టాండ్‌ సెంటర్‌ వద్దకు తీసుకొచ్చారు. వీరు డబ్బు తెచ్చిన విషయం గమనించిన సత్తిబాబు, అతని స్నేహితుడు ఏలూరు ఆనంద్‌లు వీరిని పిలిచి.. తమ కారులోకి ఎక్కించుకున్నారు. ఈలోగా తాడేపల్లిగూడేనికి చెందిన షేక్‌ సుబాని, జంగారెడ్డిగూడేనికి చెందిన పిల్లిబోయిన గణేష్‌ వీరి కారులోకి చొరబడి కత్తిని చూపించి బెదిరించి నగదు బ్యాగ్‌ను లాక్కున్నారు. అనంతరం కారు నుంచి దించేసి వారంతా పరారయ్యారు. తాము మోసపోయమని గ్రహించిన బాధితులు ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ఆదేశాల మేరకు డీఎస్పీ డి.విశ్వనాథ్‌ పర్యవేక్షణలో సీఐ బోణం ఆదిప్రసాద్‌, ఎస్సైలు బాదం శ్రీనివాస్‌, పి.నాగరాజు సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి నక్క సత్తిబాబు, ఆనంద్‌, పిల్లిబోయిన గణేష్‌, షేక్‌ సుబానిలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4,20,000 నగదును, రెండు అరల సూట్‌కేస్‌, బ్యాగులు, బ్లేడు కత్తి స్వాధీనం చేసుకున్నారు.

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన 1
1/1

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement