తల్లికి పంగనామం | - | Sakshi
Sakshi News home page

తల్లికి పంగనామం

Jun 15 2025 8:09 AM | Updated on Jun 15 2025 8:09 AM

తల్లి

తల్లికి పంగనామం

ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2025

అమ్మ ఒడే మేలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించిన వి ధంగా అమ్మ ఒడిని పక్కాగా అమలు చేసింది. 2019–20 మొదలు వరుసగా 4 విద్యా సంవత్సరాల్లో జిల్లాలో రూ.1,069.30 కోట్లను 1,78,919 తల్లుల ఖాతాల్లో జమచేసింది. అలాగే చిరుద్యోగులైన అంగన్‌వాడీలు, మున్సిపల్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, రెవెన్యూ ఇతర విభాగాల్లో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఇలా అన్ని కేటగిరీల్లోని వారికీ పథకాన్ని అమలుచేశారు. కేవలం 75 శాతం హాజరు మినహా గతంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కూటమి ప్రభుత్వం మాత్రం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగం, పట్టణాల్లో 1000 చ.అ. కంటే ఎక్కువ ఆస్తి ఉండకూడదని ఆంక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతంలో రూ.12 వేలు ఆదాయ పరిమితి, తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉండటం, 3 ఎకరాల కంటే ఎక్కువ భూ మి ఉన్నా, ఫోర్‌ వీలర్‌ వాహనాలు ఉన్నా ఈ పథకం వర్తించదని ఆంక్షలు విధించడంతో జి ల్లాలో వేలాది మంది అనర్హులుగా మారారు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు: తల్లికి వందనమంటూ పంగనామం పెట్టారు. ప్రతి ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఎంత మంది ఉంటే అంత మందికీ రూ.15 వేలు ఇస్తామని సోషల్‌ మీడియాలో హోరెత్తించారు. కట్‌ చేస్తే సరికొత్త ఆంక్షలు, అనర్హులు అంటూ రకరకాల కోతల పేరిట అర్హుల జాబితాను భారీగా తగ్గించారు. దీంతో పాటు ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అని ప్రకటించి రూ.13 వేలే జమ చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో ఏలూరు రూరల్‌ మండలంలో అమ్మఒడి పథకం 4,241 మంది విద్యార్థులకు మొదటి సంవత్సరం అందగా ఈ ఏడాది తల్లికి వందనం పేరుతో 3,888 మందిని అర్హులుగా ప్రకటించి 1,109 మందిని అనర్హులుగా గుర్తించడం విశేషం. జిల్లావ్యాప్తంగా 28 మండలాల్లోనూ ఇదే పరిస్థితి.

ఆంక్షల కత్తి : జిల్లాలో 1,818 ప్రభుత్వ పాఠశాలలు, 495 ప్రైవేట్‌ కళాశాలల్లో కలిపి 2,91,858 మంది, అలాగే 127 ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో 31,448 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతిఒక్కరికి తల్లికి వందనం ద్వారా రూ.15 వేల చొప్పున రూ.486.96 కోట్లు జిల్లాలో జమ చేయాల్సి ఉంది. అయితే విద్యుత్‌ బిల్లుల నెల వారీ వినియోగం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం, నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండటం ఇలా అనేక రకాల ఆంక్షలతో అర్హుల జాబితాను 40 శాతానికిపైగా కోత విధించడంతోపాటు రూ.15 వేలు కాకుండా రూ.13 వేలే జమ చేసి మిగిలిన రూ.2 వేలు కలెక్టర్‌ ఖాతాలో వేసి పాఠశాలల మరమ్మతులు, పరిశుభ్రత ఇతర అవసరాల కోసం వినియోగిస్తామని ప్రకటించారు.

రూ.15 వేలు ఇవ్వాల్సిందే..

నూజివీడు: తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ రూ.15 వేల చొప్పున చెల్లించాల్సిందేనని ఏఐఎస్‌ఎఫ్‌ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్‌, కోశాధికారి ఎం.క్రాంతికుమార్‌ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అందరికీ రూ.15 వేల చొప్పున చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు, లోకేష్‌ ఇప్పుడు మాటమార్చి రూ.13 వేలు విడుదల చేయడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.పాఠశాలల మెయింటినెన్స్‌ కోసం రూ.2 వేలు తగ్గించామనడం హాస్యాస్పదంగా ఉందని, ప్రైవేట్‌ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మెయింటినెన్స్‌ ఏంటో విద్యాశాఖ మంత్రి లోకేష్‌ వెంటనే సమాధానం చెప్పాలన్నారు. పథకాన్ని ఎగ్గొట్టడానికి ఏదో ఒక సాకును వెతికే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. తల్లికి వందనం పథకాన్ని సక్రమంగా అమలు చేయాలనే డిమాండ్‌తో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

సగం మందికి పైగా..

జిల్లావ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా అనర్హులుగా ప్రకటించారు. దీంతో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మొదలు సర్పంచ్‌ల వరకూ జిల్లావ్యాప్తంగా సుమారు 3,500 మందిపైనే అనర్హులుగా మారారు. జిల్లాలో 3,23,303 మంది విద్యార్థులకుగాను కనీసం సగం మందికి పైన కూడా తల్లికి వందనం అందడం అనుమానమే. ఉదాహరణకు ఏలూరు రూరల్‌ మండలంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంటికి ఒక్కరికే అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. ఈ లెక్కన 2019–20లో 4,241 మందికి రూ.63.31 లక్షలు జమ చేశారు. ఈ క్రమంలో రూరల్‌ మండలంలోని 11 సచివాలయాల పరిధిలో ఎక్కువ ఇళ్లల్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటారు. ఈ క్రమంలో అర్హుల జాబితా 6 వేలపైనే ఉండాలి. అయితే 3,888 మంది విద్యార్థులు అర్హులుగా ప్రకటించి ఇప్పుడు రూ.50.54 లక్షలు మంజూరు చేయగా 1,109 మంది విద్యార్థులను అనర్హులుగా ప్రకటించారు. అలాగే ఉదాహరణకు చింతలపూడి మండలంలోని 10 సచివాలయాల పరిధిలో గతంలో 8,240 మంది విద్యార్థులకు రూ.12.36 కోట్లు అమ్మఒడి జమ కాగా తల్లికి వందనం మాత్రం 4,837 మందే అర్హులుగా ప్రకటించి 2,055 మందిని అనర్హుల జాబితాలో చేర్చారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంపై నిరసన వ్యక్తమవుతోంది.

న్యూస్‌రీల్‌

ఆంక్షల వలయంలో తల్లికి వందనం

జిల్లాలో వేలాది మంది అనర్హులుగా గుర్తింపు

ప్రతి మండలంలో సగటున 30 శాతం మందికి కోత

జిల్లాలో 3.23 లక్షల మంది విద్యార్థులు అర్హులు

పంచాయతీ సర్పంచ్‌లు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నో చాన్స్‌

అంగన్‌వాడీలు కూడా తల్లికి వందనానికి అనర్హులు

రూ.15 వేలు ప్రకటించి రూ.13 వేలే జమ

తల్లికి పంగనామం 1
1/1

తల్లికి పంగనామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement