
ఎకోలి వేస్ట్ మేనేజ్మెంట్ బెస్ట్
కై కలూరు: చెత్త నుంచి సంపద తయారీలో సరికొత్త విధానం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్ కార్పొరేషన్లు 17, మున్సిపాలిటీలు 77, నగర పంచాయతీలు 29, గ్రామ పంచాయతీలు 13,325 ఉన్నాయి. రోజూ వేలాది టన్నుల చెత్తను పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తున్నారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పలు ప్రాంతల్లో నిరూపయోగంగా మారాయి. రోజువారి చెత్త సైతం పేరుకుపోవడంతో డంపింగ్ యార్డులు సరిపోవడం లేదు. పైగా దుర్వాసన కూడిన విష వా యువులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎకోలి బయో సొల్యూషన్స్ తో చెత్తను సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు.
21 రోజుల్లో సేంద్రియ ఎరువు తయారీ
ఎకోలి బయోసొల్యూషన్ పేరుతో మైక్రోబియల్ ఎక్స్ ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. టన్ను చె త్తకు లీటరు నుంచి లీటరున్నర ద్రావణాన్ని తడి చెత్తకు పిచికారీ చేస్తున్నారు. కేవలం 21 రోజుల్లో చెత్త సేంద్రియ ఎరువుగా మారుతోంది. అదే వర్మీ కంపోస్టులో ఈ కాలం 90 రోజులుగా ఉంది. పైగా కూలీల ఖర్చు అధికం. లీటరు ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి తడి చెత్తపై ఉపయోగించవచ్చు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి, చినఅమిరం గ్రామాల్లో టన్ను చెత్తపై పైలెట్ ప్రాజెక్టుగా మైక్రోబియల్ ద్రావణాన్ని ఉపయోగించి సత్ఫలితాలు సాధించారు. మరిన్ని పంచాయతీలకు దీనిని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎరువు తయారీలో బ్యాక్టీరియా కీలకం
మైక్రోబియల్ ఎక్స్ ద్రావణం తయారీకి గుజరాత్ నుంచి మూడు బ్యాక్టీరియాలు కలిగిన నీటిని తీసు కువచ్చి ఉయ్యూరు సమీప పరిశ్రమలో ప్రయోగాత్మకంగా ద్రావణాన్ని తయారు చేశారు. దీనిని తడి చెత్తపై పిచికారీ చేసిన తర్వాత నీటిలోని బ్యాక్టీరియాలు 21 రోజుల్లో చెత్తను తిని విసర్జిస్తాయి. ఇది సేంద్రియ ఎరువుగా మారుతుంది. దీనిని మొక్కలు పెరుగుదల, ఆక్వా చెరువులు, వరి చేలకు ఉపయోగించవచ్చు. ద్రావణం పిచికారీ చేసిన తర్వాత మూడు రోజుల్లో దుర్వాసన సైతం ఉండదు. లీటరు ద్రావణం తక్కువ ధరకే లభిస్తుంది.
రసాయనాలను గుర్తించే ఓడోమెన్ డివైజ్
డంపింగ్ యార్డుల వద్ద చెత్త పేరుకుపోయి దుర్వాసనతో వాతావరణం కలుషితమవుతోంది. గాలిలో వాయువుల పరిస్థితిని తెలుసుకోడానికి ఓడోమెన్ డివైజ్ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రత, తేమ, హైడ్రోజన్, సహజ వాయువుల శాతాన్ని తెలుసుకుంటున్నారు. దీని ప్రకారం గాలి నాణ్యత, కుళ్లిపోయే చెత్త పురోగతిని అంచనా వేస్తున్నారు. దీనిని డ్యాష్బోర్డుకు అనుసంధానం చేసి మిథిన్ వంటి ఉద్గారాలను తగ్గించడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించే అవకాశం కలుగుతుంది.
చెత్త నుంచి సంపద సృష్టిలో సరికొత్త విధానం
రసాయన పిచికారీతో 21 రోజుల్లో సేంద్రియ ఎరువుగా చెత్త
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో పైలెట్ ప్రాజెక్ట్
కంపోస్టు ఎరువుల తయారీలో నూతన సాంకేతికత
టన్ను చెత్తకు లీటరు బయో సొల్యూషన్ లిక్విడ్
స్వచ్ఛ భారత్ వైపు అడుగులు
వ్యర్థాలను పూడ్చటం, దహనం చేయడం వల్ల హానికర కాలుష్య కారకాలు విడుద లవుతాయి. ఎకోలి బయో సొల్యూషన్స్ ద్రావణాన్ని చెత్తపై పిచికారీ చేస్తే ఎటువంటి దుర్వాసన లేకుండా కంపోస్టు ఎరువు తయారవుతుంది. చేపల చెరువులకు సైతం దీనిని ఉపయోగించవచ్చు. కై కలూరు ప్రభుత్వ మత్స్యశాఖ లేబోరేటరీ ఎరువులో పోషకాలను పరీక్షించి గుర్తింపు పత్రం ఇచ్చింది. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ద్రావణాన్ని తక్కువ ధరకు అందిస్తున్నాం.
– నడింపల్లి మణిరాజు, ఎకోలి బయో సొల్యూషన్స్, భీమవరం

ఎకోలి వేస్ట్ మేనేజ్మెంట్ బెస్ట్

ఎకోలి వేస్ట్ మేనేజ్మెంట్ బెస్ట్