
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు ప్రాణసంకటంగా మారింది. స్థానిక కొండ కాలనీకి చెందిన మీర్జావలి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడి సిబ్బంది కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయలేదు. తమ దగ్గర ఉన్న వైద్య పరికరాలు పనిచేయటం లేదని మరో ఆస్పత్రికి తీసుకువెళ్లండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో మీర్జా వలి కుటుంబసభ్యులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. 20 వేల జనాభా ఉన్న ఆగిరిపల్లి పీహెచ్సీలో వై ద్యుడిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పీహెచ్సీలో రాత్రిళ్లు వైద్యుడు ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
డీఎస్సీ పరీక్షలకు 341 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షలకు 341 మంది అభ్యర్థులు హాజరయ్యా రు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 180 మందికి 167 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 205 మందికి 174 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగా యని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
భీమవరం: జిల్లాలో శనివారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలకు 77 శాతం అభ్యర్థులు హాజరైనట్లు డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం సెషన్లో 100 మందికిగాను 77 మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు.
అనర్హుల వివరాలు నమోదు చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హుల జాబితాల్లో తమ పిల్లల పేర్లు ఉన్నాయని తల్లిదండ్రులు ఫిర్యా దు చేస్తున్న సందర్భాల్లో సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్లు తక్షణమే ఎన్బీఎం పోర్టల్లో లాగిన్ అయ్యి సర్వీస్ రిక్వెస్ట్లో గ్రీవెన్స్ నమోదు చేయాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చారన్నారు. తాత్కాలికంగా సాంకేతిక కారణాల వల్ల అనర్హులుగా కనిపిస్తున్నవారి వివరాలను తప్పనిసరిగా ఆఫ్లైన్ రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అలా గే ఈ పథకంలో భాగంగా ప్రతి విద్యార్థి వద్ద నుంచి రూ.2 వేలు మౌలిక సదుపాయాల నిర్వహణ నిమిత్తం కోత విధిస్తున్నారని, ఈ మొ త్తాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక ఖాతాలో జమ చేసి, ఆయా పాఠశాలల్లో శుభ్రత, మరమ్మతులు, పునరుద్ధరణ కార్యకలాపాలకు వినియోగిస్తారని చెప్పారు.
తాగునీటి చెరువు శుభ్రం
పెంటపాడు: ‘తాగునీటి కుళాయిల నుంచి కలుషిత జలాలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రావిపాడులో నాచుతో అడుగంటిన చెరువులను శనివారం సుమారు 50 మంది కూలీలతో శుభ్రం చేయించారు. సమీపంలోని వెంకయ్య వయ్యేరు నుంచి మోటార్ ద్వారా చెరువులోకి నీరు తోడిస్తున్నారు. రెండు రోజుల్లో కొండేపాడు, రావిపాడు గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందిస్తామని గ్రామ కార్యదర్శి శేఖర్బాబు తెలిపారు.
పాలకోడేరులో అధిక వర్షపాతం
భీమవరం: జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం నమోదైంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వర్షం కొన్నిచోట్ల ఽభారీగా, మరి కొన్నిచోట్ల మోస్తరుగా పడింది. పాలకోడేరు మండలంలో అత్యధికంగా 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వీరవాసరంలో 50.2, భీమవరంలో 47.8, మొగల్తూరులో 33.2, నరసాపురంలో 31.6, ఉండిలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.