
స్కూళల్లో ఉచిత సీట్ల నిరాకరణపై ఫిర్యాదు
రథోత్సవాలకు ఏర్పాట్లు
శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథస్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి రథోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 8లో u
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని ఆదేశించినా జిల్లాలోని పలు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, టీచర్స్, ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఆయా కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు వివిధ కారణాలు చెబుతూ సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏఏ పాఠశాలలో ఎన్ని సీట్లు కేటాయించారో, ఎన్ని సీట్లు భర్తీ చేశారో తెలపాలని డీఈఓను వినతిపత్రం ద్వారా కోరామన్నారు.