
మోటార్సైకిళ్ల దొంగ అరెస్ట్
రూ.13 లక్షల విలువైన మోటారు సైకిళ్లు స్వాధీనం
తాడేపల్లిగూడెం అర్బన్ : పట్టణంలో రాత్రి సమయంలో మోటారుసైకిళ్లను దొంగలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పట్టణ ఎస్సై నాగ రాజు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు పట్టణానికి చెందిన పూతి ప్రసాద్ అలియాస్ పెరుమాళ్ల దాలయ్య పలు పట్టణాల్లో రాత్రి సమయాల్లో సంచరిస్తూ ఇళ్ల ముందు ఉన్న కొత్త మోటారుసైకిళ్లను దొంగలిస్తున్నాడు. దీంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పూత్తి ప్రసాద్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి రూ.13 లక్షలు విలువైన 9 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెం పరిధిలో నాలుగు, తణుకు టౌన్లో 1, రావులపాలెంలో రెండు, గుడివాడ టౌన్లో ఒకమోటారుసైకిల్ దొంగలించాడు. ఈ మేరకు ప్రసాద్పై కేసు నమోదు కోర్టుకు హాజరుపర్చనున్నారు. పూతి ప్రసాద్ గతంలో వివిధ జిల్లాల్లో సుమారు వంద నేరాలు చేసి జైలుశిక్ష అనుభవించాడు.
ఆరుతడి పద్ధతితో అధిక దిగుబడి
ఏలూరు(మెట్రో): వరిలో ఆరుతడి పద్ధతి సాగుతో అధిక దిగుబడిని సాధించవచ్చని డీఏఓ షేక్ హబీబ్ బాషా, జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేష్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కళ్యాణి అపార్ట్మెంట్లో శుక్రవారం కమ్యూ నిటీ రిసోర్స్పర్సన్స్కు అంతర్జాతీయ పరిశోధన కోర్ ప్రాజెక్ట్ గురించి డీఏఓ షేక్ హబీబ్ బాషా వివరంచారు. వరిలో ఆరుతడి పద్ధతి, హరిత గృహవాయువు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. అలాగే కోర్ ప్రాజెక్టు సిబ్బంది ఈ శిక్షణలో వరిలో ఆరుతడి పద్ధతి ఏ విధంగా పాటించాలి? అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు. ఆరుతడి పద్ధతి సాగు వల్ల 30 శాతం వరకు సాగు నీరు ఆదా అవుతుందన్నారు. అలాగే మెరుగైన పంట ఎదుగుదల ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎంయూ స్టాఫ్ శాసీ్త్రయ శాస్త్రవేత్తలు అంకిత పాల్, పవన్ యెగ్గిన్ తదితరులు పాల్గొన్నారు.