మా జీవనోపాధికి గండి | - | Sakshi
Sakshi News home page

మా జీవనోపాధికి గండి

Jun 12 2025 3:19 AM | Updated on Jun 13 2025 5:21 AM

మా జీవనోపాధికి గండి

మా జీవనోపాధికి గండి

కై కలూరు: నిబంధనల ప్రకారం సర్వీసు గడువు మిగిలి ఉండగానే ఉద్యోగాలు తీసేశారని రేషన్‌ దుకాణాల ఎండీయూ ఆపరేటర్లు వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌)ను కై కలూరు పార్టీ కార్యాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. ఎండీయూ సంఘ జిల్లా అధ్యక్షుడు సంగుర్తి జయరాజు మాట్లాడుతూ ఆపరేటర్ల సర్వీసు 18 నెలలు ఉందన్నారు. ఉద్యోగాలు పోవడంతో కుటుంబం మొత్తం వీధిన పడ్డాయన్నారు. తమ సమస్యలు వెల్లడించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసే అవకాశం కల్పించాలని కోరారు. డీఎన్నార్‌ మాట్లాడుతూ ఎండీయూ ఆపరేటర్ల ఇబ్బందులను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎండీయూ సంఘ కార్యదర్శి కమతం సుబ్బయ్యదాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement