లోతట్టు ప్రాంతాలు జలమయం | - | Sakshi
Sakshi News home page

లోతట్టు ప్రాంతాలు జలమయం

Jun 12 2025 3:19 AM | Updated on Jun 13 2025 5:21 AM

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం

కై కలూరు: అకాల వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమమ్యాయి. ఏలూరు జిల్లాలోనే అత్యధిక వర్షపాతం కై కలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో 193.6గా బుధవారం నమోదైంది. మండవల్లి మండలంలో 96.4, కై కలూరు మండలంలో 75.2, కలిదిండి మండలంలో 38.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కై కలూరులో పలు డ్రెయిన్లలో నీరు పొంగి రహదారులపైకి చేరాయి. వెలంపేటలో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. కై కలూరు టౌన్‌హాల్‌లో చేరిన నీటితో ఆ ప్రాంతం బురదగా మారింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మార్పు జరిగి ఇలాంటి అకాల వర్షాలు కురిస్తే చేపల చెరువుల్లో ఆక్సిజన్‌ సమస్య ఉత్పన్నం అవుతోందని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement