
ప్రకృతి సాగుపై అవగాహన
ద్వారకాతిరుమల: ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా తమకు ప్రకృతి సాగు విధానాలు, ప్రయోజనాలపై అవగాహన కలిగిందని ఇథియోపియా దేశ బృందం తెలిపింది. మండలంలోని గుండుగొలనుకుంటలో ఆదర్శ రైతు గోపాలకృష్ణమూర్తికి చెందిన ప్రకృతి వ్యవసాయ పొలాన్ని ఇథియోపియా దేశానికి చెందిన 10 మంది సభ్యులతో కూడిన బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా బృంద సభ్యులు ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్ తయారీ కేంద్రాన్ని(ఎన్పీఎం షాప్) పరిశీలించారు. అనంతరం వారు సీడ్ పెలైటెజేషన్, అగ్నిఅస్త్రం, ద్రవ జీవామృతం, బీజామృతం, దశపర్ణి తయారీ విధానాలను ప్రత్యక్షంగా వీక్షించారు. పొలంలో 25 రకాల పంటలను సాగు చేసి ఆదాయాన్ని పొందుతున్న తీరు వారిని ఆకట్టుకుంది.