ప్రకృతి సాగుపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సాగుపై అవగాహన

Jun 12 2025 3:19 AM | Updated on Jun 13 2025 5:21 AM

ప్రకృతి సాగుపై అవగాహన

ప్రకృతి సాగుపై అవగాహన

ద్వారకాతిరుమల: ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా తమకు ప్రకృతి సాగు విధానాలు, ప్రయోజనాలపై అవగాహన కలిగిందని ఇథియోపియా దేశ బృందం తెలిపింది. మండలంలోని గుండుగొలనుకుంటలో ఆదర్శ రైతు గోపాలకృష్ణమూర్తికి చెందిన ప్రకృతి వ్యవసాయ పొలాన్ని ఇథియోపియా దేశానికి చెందిన 10 మంది సభ్యులతో కూడిన బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా బృంద సభ్యులు ప్రకృతి వ్యవసాయ ఇన్‌పుట్‌ తయారీ కేంద్రాన్ని(ఎన్‌పీఎం షాప్‌) పరిశీలించారు. అనంతరం వారు సీడ్‌ పెలైటెజేషన్‌, అగ్నిఅస్త్రం, ద్రవ జీవామృతం, బీజామృతం, దశపర్ణి తయారీ విధానాలను ప్రత్యక్షంగా వీక్షించారు. పొలంలో 25 రకాల పంటలను సాగు చేసి ఆదాయాన్ని పొందుతున్న తీరు వారిని ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement