
ముగిసిన వరాల వెంకన్న కల్యాణోత్సవాలు
అత్తిలి: ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీవరాల వేంకటేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవాలు శ్రీపుష్పయాగోత్సవంతో బుధవారం ముగిశాయి. గ్రామానికి చెందిన పెరికల పాండురంగ, అనంతలక్ష్మి దంపతులచే స్వామివారిని 200 మూరల మల్లెపూలతో విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో పూజాధికాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. మంతెన సీతారామరాజు, కొట్టు పరశురామయ్య పర్యవేక్షణలో అల్లరి పళ్లెం డ్రా తీశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఆకుల వెంకటనారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
పోక్సో కేసు నమోదు
భీమవరం: మైనర్ బాలికను ప్రేమించి వివాహం చేసుకుని తల్లి అయిన తర్వాత తప్పించుకుని వెళ్లిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన ఇది. భీమవరం రెండో పట్టణంలోని ఒడిశాకు చెందిన ఓ బాలిక ఇంటి నుంచి వచ్చి భీమవరంలోని ఓ హోటల్లో పనికి చేరింది. అక్కడ అస్సాంకు చెందిన వ్యక్తితో పరిచయం కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. గర్భం దాల్చడంతో విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటిని తీసుకుని అక్కడ ఉంచాడు. ఇటీవల ఆమెకు పాప పుట్టింది. తన తల్లిదండ్రులను చూసి వస్తానని వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో అక్కడి పోలీసులను ఆశ్రయించగా కృష్ణలంక పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి వివరాలను భీమవరం పోలీసులకు అప్పగించారు. సీఐ జి. కాళీచరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముగిసిన వరాల వెంకన్న కల్యాణోత్సవాలు