
వృద్ధులకు బాసటగా నిలవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వృద్ధులను ఆదరించాలని, వారికి బాసటగా ప్రతి ఒక్కరూ నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ కోరారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15న ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సులో ఎక్కువ మంది పాల్గొని వృద్ధుల సమస్యలు తెలుసుకోవాలని కోరారు.
జూలై 5న రెండో జాతీయ లోక్ అదాలత్
జూలై 5వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకు లావాదేవీల కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, సివిల్ వివాదాలు, చిట్ ఫండ్ వివాదాలు లోక్అదాలత్లో రాజీ చేయడం జరుగుతుందన్నారు. గత లోక్ అదాలత్లో 5,236 కేసులు రాజీ చేసినట్లు చెప్పారు. కేసుల పరిష్కారంలో సమస్యలు ఎదురైతే 15100 లేదా 08812 224555 ద్వారా సంప్రదించాలన్నారు.