బెల్టు షాపులను అరికట్టలేని ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

బెల్టు షాపులను అరికట్టలేని ప్రభుత్వం

Mar 23 2025 12:33 AM | Updated on Mar 23 2025 12:34 AM

బెల్టు షాపులను అరికట్టలేని ప్రభుత్వం

బెల్టు షాపులను అరికట్టలేని ప్రభుత్వం

భీమవరం: రాష్ట్రంలో బెల్టుషాపులను అరికట్ట లేని కూటమి ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి దుయ్యబట్టారు. శనివారం భీమ వరం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా లో 70 వేలకుపైగా బెల్టుషాపులు ఉన్నాయని, గోవా, యానాం నుంచి అక్రమ మద్యం వస్తుండటంతో తాటి కల్లు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో గీత కార్మికుల పరిస్థితి మ రింత అధ్వానంగా మారిందన్నారు. కల్లు గీత వృత్తిలో మార్పు తెచ్చి గీత కుటుంబాలకు ఉ పాధి కల్పించి ఆదుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతోనే బెల్ట్‌ షాపులు నిర్వహించ డం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ బెల్ట్‌ షాపులు, అక్రమ మద్యం అరికట్టలేని ఎక్సైజ్‌శాఖ గీత కార్మికుల ఇళ్లపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement