
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కాకినాడ సిటీ: స్థానిక న్యూ పోర్ట్ రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్ఫాం దిగవన రైతుల పట్టాల వద్ద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు జీఆర్పీ ఎస్ఐ వాసు తెలిపారు. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తు, చామన ఛాయ కలిగి ఉండి బ్లూ కలర్ ట్రాక్ ఫ్యాంట్ సిమెంటు కలర్ టీషర్టు దానిపై ఫ్రంట్ సైడ్ బ్లాక్ అండ్ వైట్ డిజైన్ ఉందన్నారు. కుడికాలుకు దిష్టి పూసలతాడు, మెడలో ఎర్రతాడు, చేతికి ఎర్రతాడు ఉన్నాయ న్నారు. ఆచూకీ తెలిసిన వారు 85558 56876 నంబర్కు తెలియజేయాలని ఎస్ఐ కోరారు.