
దారి దోపిడీ కేసులో నలుగురి అరెస్టు
కోటనందూరు: దారి దోపిడీ కేసులో నలుగురు యువకులను అరెస్టు చేశామని స్థానిక ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. వివరాల్లోకెళితే.. రాజమహేంద్రవరానికి చెందిన అల్లాది నాగేంద్రసాయి, గాలంకి కిరణ్బాబు లంబసింగి పర్యటనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 22న తెల్లవారుజాయు 2 గంటల సమయంలో తుని–నర్సీపట్నం రోడ్డులో మండలంలోని కాకరాపల్లి స్సైసీ రెస్టారెంట్ ఎదురుగా వచ్చేసరికి గుర్తు తెలియని ఆరుగురు యువకులు రెండు స్కూటీలపై వచ్చి అడ్డగించారు. ఆరుగురులో ఒకరు వీరిని క్రికెట్ బ్యాట్తో బెదిరించగా మరొకరు వీరిని చెంపలపై కొట్టారు. మరొక వ్యక్తి న్యూస్ రిపోర్టర్గా చెప్పి ఫొటోలు తీశాడు. మిగిలివారు బాధితుల నుంచి బలవంతంగా పల్సర్ బైక్, రెండు సెల్ఫోన్లు, దుస్తుల బ్యాగు, రూ.1,400 నగదు దోచుకొని బెదిరించి పారిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గాంధీనగరం, తాండవ జంక్షన్ల మధ్య సమావేశమై దొంగిలించిన బైకును అమ్మి గంజాయి కొనుగోలు చేసేందుకు పన్నాగం పన్నుతున్నట్లు అందుకున్న సమాచారంతో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సై రామకృష్ణ సిబ్బందితో దాడి చేశారు. పెట్టం కామరాజు అలియాస్ వైన్షాప్నాని, గూటూరి సాయిదుర్గాప్రసాద్, సంగు నాగవెంకట భవానీ కుమార్, చింతా పవణ్కళ్యాణ్లను ఆరెస్టు చేశారు. చల్లా నాగశివమణికంఠ, ఏనుగుపల్లి రాజు పరారీలో ఉన్నారు. వీరంతా కాకినాడ పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు.