
వైద్య ధ్రువపత్రాల పరిశీలన
కాకినాడ క్రైం: త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు జరగనున్న నేపథ్యంలో తమ వైద్య ధ్రువపత్రాల పరిశీలన కోసం బారులు తీరారు. గురువారం కాకినాడ జీజీహెచ్లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన 192 మంది ఉపాధ్యాయులు వైద్య ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపిఆర్ విఠల్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, డిప్యూటీ కలెక్టర్, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, ఏఆర్ఎంవో డాక్టర్ లావణ్య పర్యవేక్షకులుగా వ్యవహరించారు. మరో రెండు రోజుల పాటు పరిశీలన కొనసాగనున్న నేపథ్యంలో సహాయం కోసం 97057 85454, 98490 31316 నంబర్లను సంప్రదించాలన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కొవ్వూరు: సీతంపేట గ్రామంలో గట్టు సత్తెమ్మ తల్లి గుడి వెనుక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం సాయంత్రం స్థానికులు గమనించారు. మృతుడి వయసు సుమారు 55 ఏళ్లు ఉండవచ్చునని భావిస్తున్నారు. అనారోగ్యంతో చనిపోయి ఉండవచ్చునని రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు. మృతుడు చూడడానికి యాచకుడిగా కనిపిస్తున్నాడు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివరాల కోసం 94407 96623 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.

వైద్య ధ్రువపత్రాల పరిశీలన