
శ్రీచైతన్య విద్యార్థుల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: పదో తరగతి పరీక్ష ఫలితాలలో శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థల రాజమండ్రి సిటీ బ్రాంచెస్ రీజినల్ ఇన్చార్జి వి.ఉదయ్ శంకర్ తెలిపారు. రాజమండ్రి మోరంపూడి బ్రాంచి విద్యార్థి 593 మార్కులతో మొదటి స్థానం, దివాన్ చెరువు బ్రాంచి విద్యార్థి కేటీఎస్ పార్వతి, ఆర్యాపురం బ్రాంచి విద్యార్థి ఎన్.జోష్మ 592 మార్కులతో ద్వితీయ స్థానం, 591 మార్కులతో బొమ్మూరు బ్రాంచి విద్యార్థి వీపీఎన్ తేజస్వి, 590 మార్కులతో సీతంపేట బ్రాంచ్ విద్యార్ధి గాయత్రి రాజ్యలక్ష్మి తరువాత స్థానాల్లో నిలిచారన్నారు. కోస్తా ఆంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవీ సురేష్ విద్యార్థులను, తల్లితండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. రాజమండ్రి సిటీ శ్రీ చైతన్య పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అకాడమిక్ కో ఆర్డినేటర్ అరుణ్ కుమార్, డీన్లు, ఇన్చార్జిలు, ఉపాధ్యాయులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీచైతన్య విద్యార్థుల ప్రభంజనం

శ్రీచైతన్య విద్యార్థుల ప్రభంజనం

శ్రీచైతన్య విద్యార్థుల ప్రభంజనం