చికిత్స పొందుతూ యువతి మృతి

వెల్గటూరు(ధర్మపురి): వెల్గటూరు మండలం కొండాపూర్కు చెందిన జల్లెల్ల మౌనిక(24) తనకు పెళ్లి కావడం లేదని మనస్తాపంతో పురుగుల మ ందు తాగగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ప్రేమ్కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మౌనికకు ఆమె కుటుంబసభ్యులు మూడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా రు. అయినా ఏ ఒక్క సంబంధం కుదరడం లేదు. పైగా తండ్రి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీనికితోడు కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. దీంతో తీవ్ర మానసిక వే దనకు గురైన మౌనిక జీవితంపై విరక్తి చెంది, ఈ నెల 13న ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటు ంబసబ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొ ందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి