టీనేజర్‌ భారీ స్కెచ్.. ప్రియుడితో కలిసి సొంత ఇల్లు లూటీ

Teenager Looted Her Own House For Lover At Rajasthan - Sakshi

రాజస్థాన్‌: దొంగతనాలకు సంబంధించిన నేరాల్లో ముందుగా ఇంటి దొంగల హస్తం ఉంటుందన్నది పోలీసుల నమ్మకం. అయితే రాజస్థాన్‌లో ఓ చోరీ కేసులోనూ పోలీసులు ఇదే రకంగా అనుమానం వ్యక్తం చేశారు. చివరకు వారి అనుమానమే నిజమైంది. అయితే ఇక్కడ చోరీకి పాల్పడింది ఎవరో తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. 

పోలీసులు తెలిపిన వివరాలు.. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని సెంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ. 33 వేల రూపాయల నగదుతో పాటు రూ. 4 లక్షల రూపాయల విలువైన నగలు మాయమయ్యాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని విచారన చేపట్టారు. ఇంట్లో తవ్వి దాచిపెట్టిన బంగారాన్ని తీసుకెళ్లడం ఇతరులకు సాధ్యం కాదు కాబట్టి ఇంట్లో వాళ్లే ఎవరో దీని వెనుక ఉన్నారని అనుమానించిన పోలీసులు ఆ ఇంటి యజమాని చిన్న కూతురు(17) ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. తనకు ఈ దొంగతనానికి కచ్చితంగా సంబంధం ఉందని భావించారు. చివరికి ఆమెను తమదైన శైలిలో విచారించగా జరిగిన విషయం నిందితురాలు బయటపెట్టింది.

అదే ఊరిలో తనతో కలిసి చదువుతున్న తన ప్రియుడే ఈ చోరీ చేశాడని తెలిపింది. అయితే దీనికి కూడా ఓ కారణం ఉందని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 17 ఏళ్ల వయసు ఉన్న ఆ అమ్మాయి మరో ఏడాదికి తన మైనారిటీ తీరుతుందని అప్పుడు ప్రియుడిని పెళ్లి చేసుకుంటే ఇబ్బంది ఉండదని ప్లాన్ చేసింది. అందుకే ముందుగానే ఇంట్లో ఉన్న నగలు దోచుకోవాలని ప్రియుడికి సలహా ఇచ్చిందని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top