యూపీలో దారుణం.. హోటల్‌ గదిలో విగతజీవిగా వైద్యాధికారి

Prayagraj Deputy Chief Medical Officer Found Dead in Hotel Room - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది.  ప్రయాగ్‌రాజ్ డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సునీల్ కుమార్ ఓ హోటల్ గదిలో ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించారు. ప్రయాగ్‌రాజ్‌లోని విఠల్‌ హోటల్‌లో సోమవారం ఉదయం జరిగింది ఈ ఘటన. హోటల్‌ సిబ్బంది మెడికల్‌ అధికారి గది తలుపులు కొట్టగా.. లోపలి నుంచి సమాధానం  రాలేదు. దీంతో బలవంతంగా డోర్స్‌ తెరిచి చూడటంతో డిప్యూటీ సీఎంవో మృతదేహం వేలాడుతూ కనిపించిందని చెప్పారు.

సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాఫీ హౌస్‌లో ఈ హోటల్‌ విఠల్‌ ఉంది. కాగా బనారస్‌కు చెందిన సునీల్‌ కుమార్‌.. అంటువ్యాధుల నోడల్ అధికారిగా  నియమితులయ్యారు. ఆయన చాలాకాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక ద‌ర్యాప్తు అనంత‌రం సునీల్ కుమార్ మ‌ర‌ణానికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయ‌ని పోలీస్ అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫోరెన్సిక్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: Munawar Faruqui: స్టాండప్‌ కమెడియన్‌కి ఊరట

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top