దారుణం: యువతిపై అత్యాచారం.. ఆపై పెట్రోల్ పోసి | Molested On Woman At Gopavaram YSR District | Sakshi
Sakshi News home page

దారుణం: యువతిపై అత్యాచారం.. ఆపై పెట్రోల్ పోసి

Oct 19 2024 3:55 PM | Updated on Oct 19 2024 4:31 PM

Molested On Woman At Gopavaram YSR District

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌ జిల్లా గోపవరం అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై  పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.

యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తనకు మాయ మాటలు చెప్పి తన ఇంటి సమీపంలో ఉన్న విగ్నేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మూడు నెలల క్రితమే విఘ్నేష్‌కు వివాహం జరిగిందని, అతని భార్య గర్భిణీగా పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement