
ప్రతీకాత్మక చిత్రం
ధర్మవరం అర్బన్(అనంతపురం జిల్లా): కూరగాయలు తీసుకురమ్మన్నందుకు భార్యపై భర్త కొడవలితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని శివానగర్కు చెందిన లక్ష్మణస్వామి, రత్నమ్మ దంపతులు. మగ్గం పనులతో జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం కూరగాయలు తీసుకురావాలని భర్తకు రత్నమ్మ తెలపడంతో డబ్బులిస్తే వెళతానని సమాధానమిచ్చాడు.
చదవండి: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను పణంగా పెట్టి..
తన దగ్గర లేవు అన్నందుకు వాగ్వాదానికి దిగి రత్నమ్మపై కొడవలితో దాడి చేశాడు. విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని వెంటనే ఆమెను అనంతపురంలోని వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేశారు.