ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు

ATM Machine Was Destroyed And Cash Stolen In Adilabad - Sakshi

క్యాష్‌ బాక్సును ధ్వంసం చేసి నగదు అపహరణ

ఆదిలాబాద్‌లో దొంగల బీభత్సం

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్ చౌరస్తాలో ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు.. క్యాష్‌ బాక్సును ధ్వంసం చేసి నగదు అపహరించారు. ఏటీఎం మిషన్‌ను సావర్గమ్‌ ప్రాంతంలో  దుండగులు పడేశారు. నిందితులను అంతర్‌రాష్ట్ర దొంగలుగా పోలీసులు గుర్తించారు. నిందితుల ఆచూకీ కోసం నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి వివరించారు. (చదవండి: వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్)‌

ఈ దొంగల ముఠా మొదట.. సోనార్ బజార్ ప్రాంతంలో వైష్ణవి జ్యువెలరీలో చోరీ చేయడానికి  యత్నం  చేశారని ఆ ప్రయత్నం విఫలమైందని.. అక్కడి నుండి  కలెక్టర్ చౌరస్తాలో ఏటీఎంలో  చోరీకి పాల్పడ్డారని తెలిపారు. తాళ్లతో కట్టి.. టవేరా వాహనంలో ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారని డీఎస్పీ వెల్లడించారు.

(చదవండి: శిగం ఊగుతుందని..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top