గోవాలో తాడేపల్లిగూడెం యువకుడి హత్య | Assassination of a man of Tadepalligudem in Goa | Sakshi
Sakshi News home page

గోవాలో తాడేపల్లిగూడెం యువకుడి హత్య

Jan 3 2025 5:32 AM | Updated on Jan 3 2025 5:32 AM

Assassination  of a man of Tadepalligudem in Goa

నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లిన స్నేహితులు

అధికంగా చెల్లించాలని డిమాండ్‌ చేసిన రెస్టారెంట్‌ సిబ్బంది

యువతితో అసభ్య ప్రవర్తన.. దీనిపై ప్రశ్నించినందుకు విచక్షణారహితంగా దాడి

తాడేపల్లిగూడెం: నూతన సంవత్సర వేడుకలను మిత్రులతో సంతోషంగా జరుపుకుందామని గోవా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు.. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ(28) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. రవితేజతో పాటు మరో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు శని­వారం గోవా వెళ్లారు. 

రెండు రోజుల పాటు గోవా­లోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. డిసెంబర్‌ 30వ తేదీ అర్ధరాత్రి నార్త్‌గోవా జిల్లా కలంగూట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అర్ధరాత్రి అయినందున బిల్లు మీద అధికంగా చెల్లించాలని రెస్టారెంట్‌ యజమాని డిమాండ్‌ చేయడంతో.. అక్కడి సిబ్బందికి, రవితేజ స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. ఈ సమ­యంలో తన స్నేహితురాలితో అక్కడి సిబ్బంది అస­భ్యంగా ప్రవర్తించడంతో రవితేజ జోక్యం చేసుకు­న్నాడు. 

వెంటనే రెస్టారెంట్‌ సిబ్బంది కర్రలతో రవితేజతో పాటు అతని స్నేహితులపై విచక్ష­ణారహితంగా దాడి చేశారు. వెదురు కర్ర విరిగి గుచ్చుకోవడంతో రవితేజ తలకు తీవ్ర గాయమైంది. మిగిలినవారు స్వల్పంగా గాయప­డ్డారు. రవితేజను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసు­కున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు­ని.. రవితేజ స్నేహితులను విచారించారు. దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement