కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.51 కోట్లు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని అధికారులు లెక్కించారు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో రూ.1,51,15,630 ఆదాయం వచ్చింది. బంగారం 25 గ్రాములు, వెండి 1.200 కిలోలుగా లెక్కకట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.9,178, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ. 9,178 వచ్చింది. యూఎస్ఏవి 709 డాలర్లు, సింగపూర్వి 55 డాలర్లు, మలేషియావి 32 రింగిట్స్, ఆస్ట్రేలియావి 40 డాలర్స్, యూరో 5 యూరో, కెనడా 35డాలర్లు వచ్చాయి. డీఈవోలు సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.


