
కిటకిటలాడిన బోయకొండ
– గంగమ్మ దీవెనల కోసం తరలివచ్చిన జనం
చౌడేపల్లె: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మ దీవెనల కోసం భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వివిధ వాహనాల్లో రావడంతో బోయకొండ జన సంద్రంగా మారింది. ఒక్క రోజే సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనె దీపాలు, దీవెలతో మేళతాళాల నడుమ జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈవో ఏకాంబరం ఆధ్వర్యంలో భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

కిటకిటలాడిన బోయకొండ

కిటకిటలాడిన బోయకొండ