
ఫిర్యాదుదారులకు న్యాయం చేయండి
చిత్తూరు అర్బన్: ఫిర్యాదుదారులకు ఇబ్బంది కలిగించకుండా, వచ్చిన ఫిర్యాదులను త్వ రితగతిన పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులను ఆదేశించారు. చిత్తూ రు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వేధింపులు, కుటుంబ సభ్యులు, దారి సమస్యలకు సంబంధించి మొత్తం 14 అర్జీలు వచ్చాయి. వీటిని పరిశీలించి ఫిర్యాదులకు న్యాయం చేయాలని ఆయన ఆదేశించారు.
మామిడి తోటల్లో గజ దాడులు
పలమనేరు: మండలంలోని ఎలిఫెంట్ క్యాంపు పక్కనే ఉన్న ముసలిమడుగు సమీపంలోని మామిడి తోటల్లో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు దాడి చేసింది. కాయలను తిని, కొమ్మలను విరిచేసినట్టు గ్రామస్తులు తెలిపా రు. పంటనష్టాన్ని స్థానిక ఫారెస్ట్ సిబ్బంది సోమవా రం పరిశీలించి పరిహారానికి నివేదికలు సిద్ధం చేశారు. అడవిలోంచి వచ్చి రైతుల పంటలను రుచిమరిగిన మదపుటేనుగులను కుంకీ ఏనుగులు అదుపు చేయడం చాలా కష్టమని ఇక్కడి రైతులు చెబుతున్నారు. అయితే ఇక్కడి ఏనుగుల సమస్యను కుంకీ ఏనుగుల ద్వారా అటవీశాఖ ఎలా కట్టడి చేస్తారో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
తండ్రి మరణానికి కారణమైన కుమారుడు అరెస్టు
చౌడేపల్లె: కన్నతండ్రి మరణానికి కారణమైన కుమారుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ ఐ నాగేశ్వరరావు సోమవా రం తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు, చౌడేపల్లె మండలం అంకుతోటపల్లెకు చెందిన చిన్నప్పరెడ్డి, రాజమ్మ దంపతుల కుమారుడు మనోహర్రెడ్డి ఆస్తి విషయమై మార్చి 30వ తేదీ తండ్రితో గొడవకు దిగాడు. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. మనోహర్రెడ్డి చేసిన దాడిలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయన్ను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయమై మార్చి 31న ‘కడుపున పుట్టికోళ్ళా... తోడేళ్లా అనే’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ ఘటనలపై స్పందించిన జిల్లా ఎీస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలు పొందిన అనంతరం చిన్నప్పరెడ్డిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఆయన తీవ్ర మనోవేదనకు గురై ఏప్రిల్ 21వ తేదీ మృతి చెందాడు. తండ్రి మృతికి కారణమైన కుమారుడు మనోహర్రెడ్డి, కోడలు సరస్వతమ్మ పరారయ్యారు. ఈ క్రమంలో పోలీసులు సోమవారం మనోహర్రెడ్డిని అరె్స్ట్ చేసి రిమాండుకు తరలించారు. పరారీలో ఉన్న సరస్వతమ్మను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

ఫిర్యాదుదారులకు న్యాయం చేయండి

ఫిర్యాదుదారులకు న్యాయం చేయండి