
ఆటో దొంగల అరెస్టు
చిత్తూరు అర్బన్: ఆటోలు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను వన్టౌన్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పట్టుబడిన ఆ ఇద్దరినీ చిత్తూరు నగరంలోని పోలీసుల అతిథి గృహంలో సీఐ మహేశ్వర అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు, ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటోలు చోరీకి గురవుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చేసిన దర్యాప్తులో దొంగలు తిరుపతివాసులుగా తేలడంతో వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, చిత్తూరు కట్టమంచి వద్ద పట్టుకున్నట్లు వెల్లడించారు. వీరిద్దరూ తిరుపతి జీవకోనకు చెందిన కొండల ఆదినారాయణ, చిన్నంగారి షణ్ముగంగా గుర్తించారు. వారి నుంచి రూ.10.50లక్షలు విలువ చేసే మూడు ఆటోలు, ఒక ఆటో విడిభాగాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేశామని, రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు.