
ప్రైవేటు చేతికి అస్త్రం
ప్రభుత్వ సేవలను ప్రైవేటు పరం చేయడంతో వాహన సామర్థ్య పరీక్షలు ప్రైవేటు నిర్వాహకుల చేతిలోకి వెళ్లనున్నాయి.
ఓపెన్ ‘పది’
బోల్తా
● పదిలో 8.91 శాతం, ఇంటర్లో 20.05 శాతం
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షా ఫలితాల్లో చిత్తూరు జిల్లా బోల్తా కొట్టింది. ఈ విద్యాసంవత్సరం జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలను విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. దీంతో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంతో పాటు అత్యధికంగా అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు.
పది ఫలితాల్లో..
ఏపీ ఓపెన్ స్కూల్లో గతంలో ఎన్నడూ నమోదు కాని విధంగా ఈ సంవత్సరం పది ఫలితాల్లో 8.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పురుషులు 506, మహిళలు 358 మొత్తం 864 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో పురుషులు 61, మహిళలు 16 మంది మొత్తం 77 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 12.06 శాతం, మహిళలు 4.47 మొత్తం 8.91 శాతం జిల్లా ఉత్తీర్ణత నమోదైంది. 787 మంది ఫెయిల్ అయ్యారు. ఓపెన్ పది పరీక్షల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 20 స్థానంలో నిలిచింది.
ఇంటర్లో ..
ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా ఉత్తీర్ణత శాతం 20.05 నమోదైంది. ఈ పరీక్షలకు పురుషులు 2005, మహిళలు 1003 మొత్తం 3008 మంది హాజరయ్యారు. వీరిలో పురుషులు 360, మహిళలు 243 మొత్తం 603 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 17.96, మహిళలు 24.23 మొత్తం 20.05 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా 20వ స్థానంలో నిలిచింది. ఈ పరీక్షల్లో 2405 మంది ఫెయిల్ అయ్యారు.
– 4లో