
కొడుకు చేతిలో గాయపడిన తండ్రి మృతి
– గ్రామస్తుల సహకారంతో అంతిమ వీడ్కోలు
చౌడేపల్లె: కొడుకు, కోడలి దాడిలో గాయపడిన తండ్రి మనోవేదనతో మృతి చెందిన ఘటన ఏ.కొత్తకోట పంచాయతీ అంకుతోటపల్లెలో సోమవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. అంకుతోటపల్లెకు చెందిన చిన్నప్పరెడ్డి(90), రాజమ్మ దంపతులకు కుమారుడు మనోహర్రెడ్డి, కోడలు సరస్వతమ్మ ఉన్నారు. కొడుకు,కోడలు కలిసి గత మార్చి 30వ తేదీన చిన్నప్పరెడ్డిని చితకబాదడంతో కాలు విరిగి పోయింది. ఈ ఘటనపై సాక్షిదినపత్రికలో ‘కడుపున పుట్టినోళ్లా...తోడేళ్లా’ అనే శీర్షికన వృద్ధ దంపతుల ధీనగాథపై ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ కథనంపై స్పందించిన ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చౌడేపల్లె పోలీసులు కొడుకు, కోడలిపై కేసు నమోదు చేశారు. కాగా తీవ్రంగా గాయపడి కాలు విరిగిన చిన్నప్పరెడ్డిను మాజీ సర్పంచ్ విజయకుమార్రెడ్డి సహకారంతో గ్రామస్తుల కలిసి మదనపల్లెలో ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వారం రోజుల క్రితం డిస్చార్జి కాగా ఇంటికి వచ్చిన చిన్పప్పరెడ్డి మనోవేదనకు గురై అస్వస్థకు గురై సోమవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులెవరూ సహకరించకపోవడంతో ఇలాంటి కష్టం మరెవరికీ రాకూడదంటూ మృతుడు భార్య రాజమ్మ చేసిన రోదన పలువురిని కలిచివేశాయి. గ్రామస్తుల సహకారంతో అంతిమయాత్ర నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో మదరసా హజ్రత్ మృతి
పలమనేరు: చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిపై స్థానిక హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమంగళం మదరసా హజ్రత్ సోహైల్ అహ్మద్(35) అక్కడిక్కడే మృతి చెందాడు. పట్టణంలో నుంచి స్కూటీలో నాగమంగళంలోని మదరసాకు వెళతుండగా ఎదురుగా సేలం నుంచి తిరుపతికి వెళుతున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొంది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. ఆయనకు భార్య ముగ్గురు ఆడపిల్లలున్నారు. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
భూసమస్యల పరిష్కారమే ప్రత్యేక అజెండా
పలమనేరు: భూ సమస్యల పరిష్కారమే ప్రత్యేక అజెండాగా చేసుకుని వీటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడించా రు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎస్సీ మణికంఠ చందోలు, జేసీ విద్యాధరి, ఎ మ్మెల్యే అమరనాథరెడ్డితో కలసి గ్రీవెన్స్డే నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడొచ్చిన సమస్యల్లో 95 శాతం రెవెన్యూ సమస్యలే ఉన్నాయన్నారు. వీటి పరిష్కారానికి ఆయా తహసీల్దార్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రానున్న మూడు నెలల్లో ప్రతి సోమవారం ఇక్కడే గ్రీవెన్స్డేను నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో పీజీఆర్ఎస్ ద్వారా 53 వేల వినతులందగా వీటిల్లో 12వేల అర్జీలు కుప్పం నియోజకవర్గంనుంచే ఉన్నాయన్నారు. త్వరలో కుప్పంలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపా రు. గతంలో పుంగనూరులో జమీందారి వ్యవస్థ, పలమనేరు ప్రాంతంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఎక్కువగా సమస్యలున్నాయని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలిపారు.

కొడుకు చేతిలో గాయపడిన తండ్రి మృతి

కొడుకు చేతిలో గాయపడిన తండ్రి మృతి

కొడుకు చేతిలో గాయపడిన తండ్రి మృతి