
చెక్డ్యామ్ ధ్వంసం
శాంతిపురం: రాళ్లబూదుగూరు పంచాయతీలోని సాతు వద్ద ఉపాధి హామీ నిధులతో ని ర్మించిన చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్య క్తులు ధ్వంసం చేశారు. రెడ్డివారిపల్లి నుంచి సాతు కొత్త చెరువుకు నీరు వెళ్లే వంకపై పదేళ్ల క్రితం చెక్ డ్యామ్ నిర్మించారు. ఇక్కడ నీరు నిండితే సమీపంలోని బోర్లలో నీటి మట్టం పెరిగి రైతులకు ఉపయోగంగా ఉండేది. కానీ ఇటీవల ఎవరో చెక్ డ్యామ్ను పగులగొట్టినట్టు స్థానికులు గుర్తించారు. చెక్ డ్యామ్నకు గండి కొట్టడంతో వర్షాలు కురిసి వంకలో నీరు వచ్చినా రైతులకు ఉపయోగపడని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. అధికారులు స్పందించి చెక్ డ్యామ్ మరమ్మతులు చేసి, దాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి శిక్షించాలని వారు కోరుతున్నారు.
సీఆర్సీ నిధులు
దుర్వినియోగంపై ఫిర్యాదు
గుడుపల్లె: ప్రభుత్వ పాఠశాలకు ఏటా ఇచ్చే మెయిన్టెన్స్ గ్రాంట్ నిధులను సీఆర్సీ ఇన్చార్జ్లు దుర్వినియోగం చేశారని పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గుడుపల్లె మండలంలో గుడుపల్లె, శెట్టిపల్లె, పొగురుపల్లె, యామగానిపల్లె, సోడిగానిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను 5 క్లస్టర్ పాఠశాలలు ఉన్నాయి. 2024–25 సంవత్సరానికి గాను ఒక్కొక్క క్లస్టర్కు రూ.లక్ష వంతున రూ.5 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులను క్లస్టరు పాఠశాలకు మెయిటెన్స్ కోసం ఖర్చు చేయాలన్నారు. కానీ గుడుపల్లె క్లస్టర్కు సంబంధించిన రూ. లక్ష నిధులు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లస్టర్ సమావేశం నిర్వహించకుండా ఉపాధ్యాయుల సూచనలు తీసుకోకుండా బినామి బిల్లులు పెట్టారన్నారు. గతంలో నా డు– నేడు కార్యక్రమంలో తీసుకువచ్చిన ఫర్నిచర్, బుక్స్లు, మెటీరియల్తోపాటు పాత వస్తువులను చూపి, కొత్త బిల్లులు సృష్టించారు. ఈ బిల్లులు ప్రకారం 2024–25 సంవత్సరానికి సంబంధించిన ఈసీలను ఉన్నతాధికారులకు అందించారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.