ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన

Apr 20 2025 2:23 AM | Updated on Apr 20 2025 2:23 AM

ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన

ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం):ఆయుష్మాన్‌ భారత్‌ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌/కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌(సీహెచ్‌ఓ) అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశా ఖ కార్యాలయం ఎదుట శనివారం వారు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈపీఎఫ్‌ఓను పునరుద్ధరించాలని, క్లినిక్‌ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్ధిష్టమైన జాబ్‌ చార్ట్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ నుంచి సీహెచ్‌ఓలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు హెచ్‌ ఆర్‌ పాలసీ, ఇంక్రిమెంట్‌, ట్రాన్స్‌ఫర్‌, ఎక్స్‌గ్రేషియా, పితృత్వ సెలవులు అమలు చేయా లని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షులు కల్పన, ఉపాధ్యక్షులు భానుప్రియ, కార్యదర్శి కీర్తి ప్రియ, సభ్యులు దివ్య భారతి, అరుణకుమారి, కవిత, గంగమణి, మోహన కుమారి, సురేష్‌కుమారి, రషీద్‌, సుధీర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement