
స్వచ్ఛ నిర్లక్ష్యం
పుంగనూరు:ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి మూడో శనివారం కార్యాలయాలు, విద్యా సంస్థలు , మున్సిపాలిటీలు , గ్రామాల్లో పరిసరాలను శుభ్రం చేయాలని నిర్ధేశించింది. అయితే పుంగనూరు శుభా రాం డిగ్రీ కళాశాలలో చీపుర్లకు బదులు కట్టె పుల్లలతో చెత్తను ఊడ్చి.. ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు బ్యానర్లు పట్టుకుని ఫొటోలకు పోజులివ్వడం విస్మయానికి గురిచేసింది. విద్యార్థులకు గురువులు నేర్పించే పద్ధతి ఇదేనా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యమవ్వడం ఇలానేనా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.