వరసిద్ధుని సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

వరసిద్ధుని సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

Apr 19 2025 9:22 AM | Updated on Apr 19 2025 9:22 AM

వరసిద

వరసిద్ధుని సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామివారిని శుక్రవారం చిత్తూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ సారిక దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆమె స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వారికి ఆలయాధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితులు ఆశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్‌ కోదండపాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి, చిత్తూరు కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

వరసిద్ధుని దర్శించుకున్న రాష్ట్ర కమిషన్‌

వరసిద్ధి వినాయకస్వామివారిని రాష్ట్ర శిశు, చిన్నపిల్లల సంక్షేమ కమిషన్‌ కేసలి అప్పారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయాధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. వేద ఆశీర్వచన మండపంలో పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి, స్వామి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అనంతరం స్థానిక మణికంఠే శ్వరస్వామి, వరదరాజుల స్వామిని దర్శించుకున్నారు.

వరసిద్ధుని సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి 1
1/1

వరసిద్ధుని సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement