
రెండు బైక్లు ఢీకొని ముగ్గురికి గాయాలు
చౌడేపల్లె: చౌడేపల్లె– తిరుపతి ప్రధాన రహదారిలోని ఆంజనేయస్వామి వద్ద ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో గురువారం ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన వేణుగోపాల్ బెంగళూరు నుంచి సదుం మండలం తిమ్మానాయనపల్లెలోని బంధువుల ఇంటికి బయలు దేరాడు. ఇదే మార్గంలో లద్దిగం గ్రామానికి చెందిన రెడ్డెప్ప, షఫీ మరొక బైక్లో సదుం నుంచి చౌడేపల్లె వైపునకు వస్తుండగా బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గరికి తీవ్ర గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇచ్చినా వాహనం ఆలస్యంగా రావడంతో కడియాల మహేష్బాబు ప్రథమి చికిత్స చేయించి వాహనంలోకి ఎక్కించే చర్యలు తీసుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.