టీచర్ల సీనియారిటీ జాబితా పూర్తికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

టీచర్ల సీనియారిటీ జాబితా పూర్తికి చర్యలు

Apr 17 2025 1:41 AM | Updated on Apr 17 2025 1:41 AM

టీచర్ల సీనియారిటీ జాబితా పూర్తికి చర్యలు

టీచర్ల సీనియారిటీ జాబితా పూర్తికి చర్యలు

చిత్తూరు కలెక్టరేట్‌ : పాఠశాల విద్యాశాఖ కార్యకలాపాలన్నీ ఒకే యాప్‌లో నిర్వహించడం జరుగుతుందని వైఎస్సార్‌ కడప జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్‌ అన్నారు. బుధవారం ఆయన డీఈవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో పలు అంశాలు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ, టీచర్ల కార్యకలాపాలకు లీప్‌ (లెర్నింగ్‌ ఎక్సెలెన్స్‌ ఏపీ ) అనే యాప్‌ ను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ యాప్‌ బుధవారం నుంచే అందుబాటులోకి వచ్చిందన్నారు. చిత్తూరు జిల్లాలో 8416 మంది టీచర్లు యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకోగా మిగిలిన 08 మంది డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉందన్నారు. టీచర్ల సీనియారిటీ జాబితా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాల్లో ఎస్జీటీ కేడర్‌ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ కు 30, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంకు 38 మొత్తం 68 అభ్యంతరాలు వచ్చాయన్నారు. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పై తరగతుల ప్రమోషన్‌ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆర్జేడీ హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈవో వరలక్ష్మి, ఏపీసీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఒకే యాప్‌లో విద్యాశాఖ కార్యకలాపాలు

డీఈవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్జేడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement