
విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం
అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ
అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ అధికారి పెద్దిరెడ్డి తెలిపారు.
సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు తెలపండి
భూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ
భూసమస్యలపై వీఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి పేర్కొన్నారు.
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
పది నెలలుగా అన్నీ అపచారాలే..
ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి. వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు.
తిరుమలలో మద్యం మత్తులో వీరంగం చేస్తున్న యువకుడు(ఫైల్)
అపచారాలకు అడ్డుకట్ట వేయలేరా?
కొన్ని నెలలుగా తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న దారుణమైన ఘటనలకు టీటీడీ అధికారులు అడ్డుకట్ట వేయకపోవడం విచారకరం. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మద్యం, మాంసం, బహిరంగంగా దొరకడం అపచారం. తిరుమలలో అకతాయితీలు మద్యం సేవించి గొడవలు పడిన సంఘటన బాధించే అంశం. టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై వస్తున్న వార్తలు గో ప్రేమికులు, శ్రీవారి భక్తులను మరింత క్షోభకు గురిచేశాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు చేపట్టాలి. లోపాలను ఎత్తి చూపడం భక్తుల బాధ్యతగా అధికారులు గుర్తించాలి. – తుమ్మ ఓంకార్,
తిరుక్షేత్రాల రక్షణ సమతి అధ్యక్షులు, తిరుపతి
వివరణ కాదు.. విచారణ జరపాలి
టీటీడీ అధికారుల నిర్ల క్ష్యం కారణంగా గోశాల లో గోవులు అధిక సంఖ్య లో మరణించాయని వస్తు న్న ఆరోపణలపై టీటీడీ అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇవ్వడం దారుణం. వాటి పై వాస్తవాలను వెలికితీసేందుకు విచారణ చేప ట్టి నిజాలను నిగ్గు తేల్చాలి. మూగజీవులు ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందడం, అనారోగ్యానికి గురికావడం భక్తుల, జంతు ప్రేమికుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. తక్షణం అఖిలపక్షం ఆధ్వర్యంలో పరిశీలన జరపాలి. నిర్లక్ష్యం కారణమైతే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – వందవాసి నాగరాజు,
సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి
గొంతు నొక్కడం భావ్యమా?
టీటీడీలో ప్రతినిత్యం ఏ దో ఒక అపచారం జరగ డం బాధించే అంశం. అధికారులు బేషాజాలకు పోకుండా భక్తుల మనోభావాలను కాపాడాలి. నిషేధి త వస్తువులను తిరుమలకు చేరకుండా పటిష్ట తనిఖీలు నిర్వహించాలి. పార్టీలకతీతంగా శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగితే లోపాలను ఎత్తి చూపడం భక్తుల హక్కు, కర్తవ్యం కూడా. అలాంటి లోపాలు జరిగినప్పుడు వెంటనే అధికారులు వాటిని సరిదిద్దేందుకు సిద్ధపడాలే తప్ప, గొంతు నొక్కడం, కేసులు బనాయించడం విచారకరం.
– నరసింహులు, స్థానిక భక్తుడు, తిరుపతి
కలియుగ వైకుంఠం.. పరమ పవిత్రం..ఆధ్యాత్మిక నిలయం..భక్తులకు అది అపురూపం.. అంతటి తిరుమల క్షేత్రం నేడు అపవిత్రం.. మద్యం, మాంసం, పాదరక్షలతో ఆలయ ప్రవేశ యత్నం.. గోశాలలో గో మరణ మృదంగం.. శ్రీవారి ఆలయంపై డ్రోన్ల సంచారం ఒకటేమిటీ వరుస సంఘటనలు చోటు చేసుకోవడం మహా అపచారం.. వెరసి భక్తుల దెబ్బతిన్న మనోభావం.. ప్రశ్నించిన గొంతు నొక్కే ప్రయత్నం.. ఎదురుదాడి.. తమ పాపం ఎదుటి వారిపై నెట్టే ప్రచారం జరుగుతోంది. ఏడుకొండలపై అసలేం జరుగుతోంది.. ఏమై పోతోంది.. అంతా సత్యం వధ.. ధర్మం చెరేనా? అని భక్తులు మదనపడుతున్నారు.
ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?
● లోపాలను ఎత్తి చూపితే..
పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే
● భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి
● ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం దారుణం
● తిరుమలలో అపచారాల కట్టడికి చర్యలు తీసుకోలేరా?
● 10 నెలలుగా సాక్షాత్తు తిరుమలలో
జరిగిన ఘటనలకు బాధ్యులెవరు?
● ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం
అపచారాలను అడ్డుకోవాలి
● టీటీడీ అధికారులకు స్థానికులు, భక్తులు, మేధావుల హితవు
తిరుపతి సిటీ: కలియుగ వైకుంఠంలో గత పది నెలలుగా సత్యం వధ.. ధర్మం చెరగా పాలన సాగుతోంది. దీన్ని ప్రశ్నించే గొంతుకలపై ఎదురుదాడి జరుగుతోంది. ఆధ్యాత్మిక సంస్థలో జరిగే లోటుపాట్లు సున్నిత పరిష్కారానికి చర్యలు లేకపోగా.. టీటీడీలో పచ్చపాలకులు, ఏజెంట్లు, అల్లరి మూకలు చేస్తున్న తప్పిదాలను రాజకీయకోణంలో చూపుతూ ప్రత్యర్థులపై నెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదంతా చూస్తే అసలు తిరుమల, తిరుపతి దేవస్థానంలో ఏమి జరుగుతోంది.. అసలు తిరుమల.. ఆధ్యాత్మిక క్షేత్రమా.. పచ్చ పాపాలకు వ్యాపార నిలయమా?.. అని భక్తులు మనోవేదనకు గురికావాల్సిన దుస్థితి నెలకొంటోంది.
రాజకీయ ఏజెంట్లుగా అధికారులు
టీటీడీలో జరుగుతున్న అపచారాలను కప్పిపుచ్చేందుకు పచ్చనేతలు ఆ ధార్మిక సంస్థలో అధికారులనే రాజకీయ ఏజెంట్లుగా మార్చుతున్నారని భక్తులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే వారు పవిత్ర పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అపచారాలను ఎత్తి చూపితే.. వాటిని పక్కదారి పట్టించేందుకు సాక్షాత్తు కార్యనిర్వాహణాధికారి స్థాయి అధికారులే ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అలాగే వారు చేసిన నేరాలు ప్రశ్నించే వారిపై నెట్టేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తూ వారికి అనుకూల మీడియాల్లో ప్రచారం చేస్తూ టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.
గంగవరం : విద్యార్థుల నుంచి గత ప్రభు త్వం ఉచితంగా అందజేసిన ట్యాబ్స్ను ఇన్చార్జ్ హెచ్ఎం స్వాధీనం చేసుకున్న సంఘటన మండలంలోని కల్లుపల్లి జెడ్పీ హైస్కూల్లో చోటు చేసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం.. గత ప్రభుత్వంలో కల్లుపల్లి జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేశారు. ఎలాంటి ప్రభుత్వ ఆదేశాలు, అనుమతి లేకుండా స్థానిక ఇన్చార్జి హెచ్ఎం నరసింహయ్య విద్యార్థుల ట్యాబ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సెకండ్ హ్యాండ్ ధరలకు విక్రయాలు చేసుకోవడం కోసమేనా అంటూ ఆ ఇన్చార్జి హెచ్ఎంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దీనిపై ఎంఈవో–1 వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థుల నుంచి ట్యాబ్స్ లాక్కోవాలన్న ప్రభుత్వ ఆంక్షలు ఎక్కడా లేవన్నారు. ఒకవేళ కల్లుపల్లి హైస్కూల్లో విద్యార్థుల నుంచి ట్యాబ్స్ వాస్తవంగా తీసుకున్నట్లు తెలిస్తే ఆ పాఠశాల ఇన్చార్జి హెచ్ఎంపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ కేడర్ నుంచి హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతికి విడుదల చేసిన జాబితాలో అభ్యంతరాలు తెలపాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరులతో మాట్లా డారు. ఈనెల 13వ తేదీన సీనియారిటీ జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. ఉద్యోగోన్నతుల ప్రక్రియకు ఏకీకృత సీనియారిటీ జాబితాను రూపొందించి www.chittoor deo.com వెబ్సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు. అన్ని మేనేజ్మెంట్ల టీచర్ల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. జిల్లాలోని టీచర్లు జాబితాల్లో సర్వీస్, సీనియారిటీ వివరాలను సరిచూసుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలున్నట్లైతే బుధవారం డీఈవో కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఆధారాలతో తెలియజేయాలని ఆదేశించారు. గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించమని డీఈవో స్పష్టం చేశారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్రీల్
మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడేనా?
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు అపకీర్తి తీసుకువచ్చే చ ర్యలను అధికారులు అడ్డుకో వాలి. మందు, మాంసం, డ్రోన్ కెమెరాల హల్చల్, అ కతాయితీల వికృత చేష్టలను ప్రశ్నించే హక్కు ప్రతి భక్తునికీ ఉంటుంది. వాటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అప చారం జరిగిన ఘటనపై ప్రత్యేక దృష్టి సారించి పున రావృతం కాకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలి. గోవుల మృతి వార్తలు భకులు, జంతు ప్రేమికులను బాధించాయి.
–మహాలక్ష్మి, శ్రీవారి భక్తురాలు, శ్రీకాళహస్తి
అధికారుల అప్రమత్తత అవసరం
టీటీడీలో తరచూ జరుగుతు న్న ఘటనలు భక్తులను బా ధిస్తున్నాయి. శ్రీవారి సన్నిధి లో ఇలాంటి అపచారాలు జరగకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండి, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. డ్రోన్ కెమెరాలతో ఫొటోషూట్ చేయడం ఎంత అపచారం. డ్రోన్ కెమెరాను ఎలా అనుమతించారో? అధికారులే సమాధానం చెప్పాలి. తిరుమలలో అభద్రతాభావం నెలకొంటే ప్రమాదమే. అధికారులు మేలుకోవాలి.
–సెల్వకుమార్, తమిళ భక్తుడు, వేలూరు

విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం

విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం

విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం

విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం

విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం

విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం

విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం

విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం

విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం