
వరసిద్ధుడి సేవలో సినీ రచయిత
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారిని సోమవారం తెలుగు సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారులు దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పండితుల ఆశీర్వచనాలు పలికి, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనుల పరిశీలన
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరి ఎమ్మెల్యే లు గురుజాల జగన్ మోహన్నాయుడు, మురళీమోహన్, నాని పరిశీలించారు. వారు సోమవారం రైల్వేస్టేషన్కు వచ్చి మీడి యాతో మాట్లాడారు. తిరుపతి–కాట్పాడి డ బ్లింగ్లైన్ ఏర్పాటుతో పలు రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అమృత్ భారత్ కింద చి త్తూరు రైల్వే స్టేషన్లో చేపట్టిన పనులు సగం కూడా పూర్తికాకపోవడంతో కాంట్రాక్టరుపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ అముద, చుడా చైర్మన్ హేమలత, రాజన్, స్టేషన్ మాస్టర్ ముత్తుస్వామి, ఆర్పీఎఫ్ సీఐ కుమార్, జీఆర్పీ ఎస్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు.
ఉద్యోగం పేరిట మోసం.. కేసు నమోదు
చిత్తూరు అర్బన్: ఉద్యోగం పేరిట నగదు మోసం చేసిన ఘటనపై సోమవారం కేసు నమోదు చే సినట్లు తాలూకా ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. చిత్తూరులోని ప్రశాంత్నగర్కు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి ఉద్యోగం పేరిట మోసపోయాడు. ఐటీ ఉద్యోగం ఇప్పిస్తామని బెంగళూరుకు చెందిన నాగర్జున అనే వ్యక్తి రూ.16.50 లక్షలు తీసుకున్నాడు. తీరా మో సం అని తెలిసి పురుషోత్తం చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నాగర్జునపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
వేటకు వెళ్లొద్దు
వాకాడు: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిసేధించారని, వేటకు ఎవ రూ వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యశాఖ నిషేధ ఆజ్ఞలు ఉల్లంఘించిన వా రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎపీ ఎంఆర్ఎఫ్ 1994 సెక్షన్(4)ను అనుసరించి శిక్షార్హులు అవుతారని, అలాగే వా రి బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటామన్నారు.