కొచ్చి చేరుకున్న నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత! | Relief Amid Middle East Tensions, LPG And Crude Oil Shipments Reach Kochi, More Details Inside | Sakshi
Sakshi News home page

కొచ్చి చేరుకున్న నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత!

Mar 31 2026 6:07 PM | Updated on Mar 31 2026 6:46 PM

Two Ships Arrived in Kochi Crude Oil and LPG

మధ్యప్రాచ్య సంఘర్షణపై నెలకొన్న ఆందోళనల నడుమ.. ఎల్‌పీజీ, ముడి చమురు నౌకలు కొచ్చికి చేరుకుని వినియోగదారులకు ఉపశమనం కలిగించాయి. ఖతార్ నుంచి ఎల్‌పీజీని తీసుకువస్తున్న 'అపోలో ఓషన్' ట్యాంకర్ నిన్న మధ్యాహ్నం కొచ్చికి చేరుకుంది. ఈ ట్యాంకర్ 9,086 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని తీసుకువస్తోంది.

నిన్న మధ్యాహ్నం కొచ్చికి చేరుకున్న ట్యాంకర్, గ్యాస్‌ను దించిన తర్వాత తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఈ ఎల్‌పీజీని ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన వివిధ బాట్లింగ్ ప్లాంట్‌లకు రవాణా చేస్తారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాపై తీవ్రమైన ఆంక్షల నేపథ్యంలో, దిగుమతి చేసుకున్న ఎల్‌పీజీ రాక చమురు కంపెనీలపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

ఇదిలా ఉండగా.. రష్యా ముడి చమురు కూడా కొచ్చికి చేరుకుంది. 'నెవా' అనే చమురు ట్యాంకర్ రష్యాలోని కోస్మినో పోర్ట్ నుండి 1,084.80 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో కొచ్చికి చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే త్వరలోనే మన దేశంలో గ్యాస్ కొరత తగ్గుతుందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement