లాభాల్లోంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు, జోరుగా ఆటో

Sensex Nifty open higher and slips into red - Sakshi

సాక్షి, ముంబై: భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సోమవారం సెషన్‌ను సానుకూలంగా ప్రారంభించాయి. కానీ ఆ తరువాత నష్టాల్లోకి మళ్లాయి. ఆరంభంలో 100 పాయింట్లుకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ 99 పాయింట్ల నష్టంతో 58891 వద్ద, నిఫ్టీ19 పాయింట్లు కోల్పోయి 17339 వద్ద కొనసాగుతున్నాయి.

ఆటో, ఆయిల్‌ అండ్‌గ్యాస్‌ సెక్టార్లు లాభాల్లోనూ, ఐటీ, బ్యాంకింగ్‌ నష్టాల్లోనూ ట్రేడ్‌ అవుతున్నాయి.   ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి, ఐషర్‌ మోటార్స్‌, హీరో మోటో కార్ప్‌ లాభ పడుతుండగా, బీపీసీఎల్‌, అదానీ, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్ర, నెస్లే నష్ట పోతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top