శక్తివంతమైన మహిళగా నిర్మలా సీతారామన్..‌

Nirmala Sitharaman Names Forbes Worlds 100 Powerful Woman - Sakshi

ఫోర్బ్స్‌ శక్తివంతమైన మహిళల జాబితాలో ఆర్థిక మంత్రి

చోటు దక్కించుకున్న రోషిణీ నాడార్‌, కిరణ్‌ మజుందార్‌ షాలు

పదోసారి ప్రథమ స్థానంలో ఏంజెలా మెర్కెల్‌

తొలిసారి ఫోర్బ్స్‌ జాబితాలో చేరిన కమలా హారిస్‌

తొలిసారే మూడో ర్యాంక్‌ కైవసం చేసుకున్న హారిస్‌

న్యూఢిల్లీ: ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో 41వ స్థానంలో నిలిచారు ఆర్థిక మంత్రి‌. నిర్మలా సీతారామన్‌తో పాటు హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణీ నాడార్ మల్హోత్రా, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా ఈ జాబితాలో నిలిచిన మిగతా భారతీయ మహిళలు. ఇక ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌ వరుసగా పదో సారి ప్రథమ స్థానంలో నిలవగా.. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ హెడ్‌ క్రిస్టిన్ లగార్డ్ వరుసగా రెండో సారి రెండో స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యాక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ తొలసారి ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొదటిసారే ఆమె ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. (చదవండి: సూపర్‌ కుమార్)

ఇక గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమితురాలైన నిర్మలా సీతారామన్‌ ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో రోషిణీ నాడార్‌ 55 స్థానంలో నిలవగా.. కిరణ్‌ మజుందార్‌ షా 68వ స్థానంలో నిలిచారు. ఇక ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో నిలిచిన వారిలో 10 మంది దేశాధినేతలు, 38 మంది సీఈఓలు, ఐదుగురు ఎంటర్‌టైనర్లు ఉన్నారు. వీరందరి వయస్సు, జాతీయత, ఉద్యోగ వివరణలో విభిన్నంగా ఉన్నప్పటికి.. వారు 2020 లో తలెత్తిన ప్రత్యేకమైన సవాళ్లను పరిష్కరించడానికి వారు తమ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు "అని ఫోర్బ్స్‌ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top