Ms Dhoni : ఈ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఎంఎస్ ధోనీ
న్యూఢిల్లీ: హోమ్ ఇంటీరియర్స్ కంపెనీ హోమ్లేన్ తాజాగా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో మూడేళ్ల కాలానికి వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. కంపెనీలో ఆయన పెట్టుబడిదారుగా, ప్రచార కర్తగానూ ఉంటారు. అయితే ఎంత పెట్టుబడి చేసిందీ కంపెనీ వెల్లడించలేదు.
హైదరాబాద్సహా 16 నగరాల్లో సేవలందిస్తున్న హోమ్లేన్ వచ్చే రెండేళ్లలో కొత్తగా 25 ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించనుంది. మార్కెటింగ్ వ్యయాల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది.