చెబితే రాసే యంత్రం.. సరికొత్త టెక్నాలజీ | Kerala Student Unveils Talk to Write Device | Sakshi
Sakshi News home page

చెబితే రాసే యంత్రం.. సరికొత్త టెక్నాలజీ

Aug 6 2025 11:30 AM | Updated on Aug 6 2025 11:55 AM

Kerala Student Unveils Talk to Write Device

టెక్నాలజీ పెరుగుతోంది, కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే కేరళకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒకరు 'టాక్ టు రైట్' అనే ఏఐ డివైజ్ రూపొందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

లింక్డ్ఇన్ పోస్ట్‌లో, అజయ్ హెచ్ అనే విద్యార్థి.. ఈ పరికరం AI బేస్డ్ వాయిస్-టు-పెన్ సిస్టమ్ అని, ఇది CNC పెన్ ప్లాటర్‌ని ఉపయోగించి మనం మాట్లాడే పదాలను చేతితో రాసిన టెక్స్ట్‌గా మారుస్తుందని వెల్లడించారు. ఈ పరికరాన్ని రాస్ప్బెర్రీ పై, ఆర్డునో (GRBL), పైథాన్‌లతో రూపొందించారని వెల్లడించారు. దీనిని ఎంటే కేరళం ఎక్స్‌పో 2025 (Ente Keralam Expo 2025)లో ఆవిష్కరించారు.

ఇదీ చదవండి: ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరిక

లింక్డ్ఇన్ పోస్ట్‌లో షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. అక్కడ అమర్చిన టాక్ టు రైట్ పరికరం మైక్‌లో అజయ్ మాట్లాడుతూ 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' అని చెబుతాడు. ఆ యంత్రం కాగితంపై ఆ ఎలాంటి తప్పులు లేకుండా రాస్తుంది. ఇది వైకల్యం ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement