ఇండియన్‌ బ్యాంకులో రూ.266 కోట్ల మోసం!

Indian Bank Reports over Rs 266 Crore Fraud to the RBI - Sakshi

మూడు మొండి పద్దుల్లో జరిగిన మోసాలు

ఆర్‌బీఐకి ఫిర్యాదు చేసిన ఇండియన్‌ బ్యాంక్‌  

న్యూఢిల్లీ: మొండిబాకీలుగా మారిన మూడు పద్దుల్లో మోసాలపై రిజర్వ్‌ బ్యాంక్‌కు ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ ఖాతాల ద్వారా రూ. 266 కోట్ల మేర మోసం జరిగినట్లు పేర్కొంది. ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా వీటిని ఫ్రాడ్‌ ఖాతాలుగా ప్రకటించినట్లు బ్యాంక్‌ తెలిపింది. 

ఎంపీ బోర్డర్‌ చెక్‌పోస్ట్‌ డెవలప్‌మెంట్‌ (బాకీ రూ. 167 కోట్లు), పుణె షోలాపూర్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ (రూ. 73 కోట్లు), సోనాక్‌ (రూ. 27 కోట్లు) వీటిలో ఉన్నాయి. ఈ మూడు కేసుల్లోనూ నిధుల మళ్లింపు రూపంలో మోసం జరిగినట్లు బ్యాంకు పేర్కొంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top