బ్రెజిల్ కంపెనీతో.. దేశీ దిగ్గజం జట్టు! | Embraer and Mahindra To Establish C 390 Millennium MRO Capability in India | Sakshi
Sakshi News home page

బ్రెజిల్ కంపెనీతో.. దేశీ దిగ్గజం జట్టు!

Feb 20 2026 6:30 PM | Updated on Feb 20 2026 6:43 PM

Embraer and Mahindra To Establish C 390 Millennium MRO Capability in India

భారత వైమానిక దళానికి సరఫరా చేసే సీ-390 మిలీనియం విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా బ్రెజిలియన్‌ సంస్థ ఎంబ్రేయర్‌తో దేశీ దిగ్గజం మహీంద్రా గ్రూప్‌ చేతులు కలిపింది. లోకలైజేషన్‌ వ్యూహంలో భాగంగా నెలకొల్పే ఈ కేంద్రంలో టెస్టింగ్, తనిఖీ, విడిభాగాల రిపేర్, శిక్షణ తదితర సర్వీసులన్నీ అందిస్తుందని ఎంబ్రేయర్, మహీంద్రా తెలిపాయి.

ఎంబ్రేయర్‌కి చెందిన సీ-390 మిలీనియం మల్టీ-మిషన్‌ మిలిటరీ రవాణా విమానాలను భారత్‌లో తయారు చేసేందుకు ఇరు సంస్థలు గతేడాది అక్టోబర్‌లో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇతర మధ్యస్థాయి మిలిటరీ రవాణా విమానాలతో పోలిస్తే సీ-390 అత్యధిక వేగం, రేంజి, 26 టన్నుల వరకు పేలోడ్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. సరుకు, బలగాల రవాణా, సెర్చ్‌ ఆపరేషన్లు మొదలైన అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement